close
Choose your channels

వైసీపీ మూడో జాబితాలో రాయలసీమలోనే కీలక మార్పులు.. మంత్రులకు స్థానచలనం..

Friday, January 12, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైసీపీ మూడో జాబితాలో రాయలసీమలోనే కీలక మార్పులు.. మంత్రులకు స్థానచలనం..

ఇప్పటికే రెండు జాబితాల్లో అభ్యర్థులకు ప్రకటించిన వైసీపీ అధిష్టానం.. తాజాగా మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 6 మంది ఎంపీలతో పాటు 15 మంది ఎమ్మెల్యేల అభ్యర్థులను ప్రకటించింది. ఇక ఈ జాబితాలో 10 స్థానాలు రాయలసీమలోనే ఉండటం గమనార్హం. ఇందులో 8 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగాయి. మంత్రి జోగి రమేశ్‌కు స్థానచలనం కలిగింది. ప్రస్తుత ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పెడన నుంచి పెనమలూరుకు మార్పు చేశారు. దీంతో పెడన నుంచి ఉప్పాడ రాముకు చోటు దక్కింది. మరో మంత్రి గుమ్మనూరి జయరాంను కర్నూలు ఎంపీ ఇంచార్జ్‌గా నియమించారు. తిరుపతి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తిని సత్యవేడు అసెంబ్లీ ఇంచార్జ్‌గా ప్రకటించారు.

ఎంపీ అభ్యర్థులు..

విశాఖపట్నం ఎంపీ - బొత్స ఝాన్సి
విజయవాడ - కేశినేని నాని
శ్రీకాకుళం - పేరాడ తిలక్
కర్నూల్‌ ఎంపీ - గుమ్మనూరి జయరాం
తిరుపతి ఎంపీ - కోనేటి ఆదిమూలం
ఏలూరు - కారుమూరి సునీల్ కుమార్ యాదవ్

ఎమ్మెల్యే అభ్యర్థులు..

ఇచ్ఛాపురం - పిరియ విజయ
టెక్కలి - దువ్వాడ శ్రీనివాస్
చింతలపూడి (ఎస్సీ) - కంభం విజయరాజు
రాయదుర్గం - మెట్టు గోవింద్ రెడ్డి
దర్శి - బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
పూతలపట్టు (ఎస్సీ) - మూతిరేవుల సునీల్ కుమార్
చిత్తూరు - విజయానంద రెడ్డి
మదనపల్లె - నిస్సార్ అహ్మద్
రాజంపేట - ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి
ఆలూరు - బూసినే విరూపాక్షి
కోడుమూరు (ఎస్సీ) - డాక్టర్ సతీష్
గూడూరు (ఎస్సీ) - మేరిగ మురళి
సత్యవేడు (ఎస్సీ) - మద్దిల గురుమూర్తి
పెనమలూరు - జోగి రమేశ్
పెడన - ఉప్పాల రాము

ఇదిలా ఉంటే ఈ జాబితా విడుదల తర్వాత ఇద్దరు మంత్రుల కుటుంబాలకు ఏకంగా మూడు టికెట్లు దక్కడం విశేషం. మంత్రి ఆదిమూలపు సురేశ్‌ కుటుంబానికి చెందిన సురేశ్‌ కొండెపి ఇంచార్జ్‌గా.. ఆయన సోదరుడు ఆదిమూలపు సతీశ్‌ను కోడుమారు ఇంచార్జ్‌గా.. ఆయన బావ తిప్పేస్వామిని మడకశిర ఇంచార్జ్‌గా నియమించారు. మరో మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి ఆయన భార్య ఝూన్సీని విశాఖ ఎంపీ అభ్యర్థిగా.. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాస్, చీపురపల్లి ఇంచార్జ్‌గా బొత్స సత్యనారాయణ నియమితులయ్యారు. కాగా తొలి జాబితాలో 11 మందితో చోటు కల్పించగా.. రెండో జాబితాలో 27 మందిని ప్రకటించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos