అజిత్‌, అర్జున్‌.. మ‌రోసారి

  • IndiaGlitz, [Tuesday,February 20 2018]

నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, పంపిణీదారుడిగా.. ఇలా సినిమాకి సంబంధించిన ప‌లు విభాగాల్లో తనదైన ముద్ర వేసారు యాక్షన్ కింగ్ అర్జున్. కన్నడ కుటుంబంలో పుట్టి.. తమిళ సినిమాలతో పాపుల‌రైన అర్జున్‌.. తెలుగులో కూడా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో సంద‌డి చేశారు. దాదాపు తొమ్మిది సంవత్సరాల గ్యాప్ త‌రువాత‌.. గత ఏడాది నితిన్ హీరోగా నటించిన 'లై' సినిమాతో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు అర్జున్‌.

ప్ర‌స్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలో అర్జున్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే విశాల్ హీరోగా వస్తున్న 'అభిమన్యుడు' (తమిళంలో 'ఇరుంబుత్తిరై') చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు ఈ యాక్షన్ కింగ్. ఇదిలా ఉంటే.. అజిత్ కథానాయకుడిగా శివ దర్శకత్వంలో 'విశ్వాసమ్‌' పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అర్జున్ ఓ కీల‌క పాత్ర చేయ‌నున్నాడ‌ని త‌మిళ‌నాట వార్త‌లు వినిపిస్తున్నాయి.

గతంలో అజిత్, అర్జున్ కలిసి నటించిన తమిళ చిత్రం 'మంగాత్తా' (తెలుగులో 'గ్యాంబ్లర్') మంచి విజ‌యం సాధించింది. మ‌రోసారి ఈ కాంబినేష‌న్ అల‌రిస్తుందేమో చూడాలి. దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా.. తెలుగులోనూ అనువాదం కానుంది.

More News

రంగమ్మ పాత్రలో అనసూయ?

లవ్ స్టోరీలను డీల్ చేయడంలో దర్శకుడు సుకుమార్ సిద్ధహస్తులు.'వన్ సైడ్ లవ్' అంటూ 'ఆర్య'సినిమాలో..

ఆ పుకార్లకి తెరదించిన సురేందర్ రెడ్డి

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'.

అమెరికా పయనమైన 'గూఢాచారి'

​గత రెండు చిత్రాలు 'క్షణం' (2016), 'అమీ తుమీ' (2017)తో విజయాల‌ను సొంతం చేసుకున్నారు యంగ్ హీరో అడివి శేష్‌. ప్రస్తుతం శశికిరణ్ డైరెక్షన్‌లో 'గూఢాచారి' సినిమాలో నటిస్తున్నారాయ‌న‌. శోభితా ధూళిపాళ్ళ కథానాయికగా నటిస్తున్న ఈ స్పై థ్రిల్లర్‌ను అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఎన్ . ఆర్ . ఐ గా గోపీచంద్?

గత కొంతకాలంగా యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోతున్నాయి.

రవిబాబు దర్శకత్వంలో రాజ్ తరుణ్

తక్కువ బడ్జెట్ తో ఓ సినిమా నిర్మించాలంటే..కథానాయకుల జాబితాలో రాజ్ తరుణ్ పేరు ఎలా ఉంటుందో..