close
Choose your channels

ఎన్ . ఆర్ . ఐ గా గోపీచంద్?

Tuesday, February 20, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గత కొంతకాలంగా యాక్షన్ హీరో గోపీచంద్ న‌టించిన‌ సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోతున్నాయి. తన పంథాను మార్చుకుని గతంలో తనకి అచ్చొచ్చిన జోన‌ర్ (కుటుంబ నేపథ్యంలో సాగే యాక్షన్ ఫిలిం)లో ఆక్సిజన్` చేసినా.. ఆ చిత్రం కూడా ఆశించిన విజయాన్ని అందించలేదు. ప్రస్తుతం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రాధామోహన్ నిర్మిస్తున్న పంతం` చిత్రంలో న‌టిస్తున్నారు గోపీచంద్‌. ఇందులో ఆయ‌న ఓ ఎన్.ఆర్.ఐ. పాత్రలో కనిపించనున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ యాక్షన్ ఎంటర్‌టైన‌ర్‌తో చక్రి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మెహ్రీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇదిలా వుంటే.. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్‌ రామోజీ ఫిలిం సిటీలో జ‌రుగుతోంది. మార్చి రెండో వారానిక‌ల్లా చిత్రీకరణ పూర్తి చేసుకోనున్న‌ ఈ చిత్రం.. వేసవి కానుకగా మే 18న విడుదల కానుంది. మరి ఈ సినిమాతోనైనా గోపీచంద్ పూర్వవైభవం అందుకుంటారేమో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.