close
Choose your channels

అమెరికా పయనమైన 'గూఢాచారి'

Tuesday, February 20, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

​గత రెండు చిత్రాలు 'క్షణం' (2016), 'అమీ తుమీ' (2017)తో విజయాల‌ను సొంతం చేసుకున్నారు యంగ్ హీరో అడివి శేష్‌. ప్రస్తుతం శశికిరణ్ డైరెక్షన్‌లో 'గూఢాచారి' సినిమాలో నటిస్తున్నారాయ‌న‌. శోభితా ధూళిపాళ్ళ కథానాయికగా నటిస్తున్న ఈ స్పై థ్రిల్లర్‌ను అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ చిత్రం ఢిల్లీ, అస్సాం, మేఘాలయ, బంగ్లాదేశ్ వంటి ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా కథానుసారం కొంత పార్టును అమెరికాలో చిత్రీకరించాల్సి ఉంది. అందుకే చిత్ర యూనిట్‌తో పాటు అడివి శేష్‌ కూడా అమెరికా పయనమయ్యారు. అక్కడ కొన్ని ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుతారు. మొత్తానికి.. లోకేష‌న్ల ప‌రంగా ఈ చిత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంద‌నే చెప్పాలి. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌రాలు సుప్రియ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.సుమారు రెండు దశాబ్దాల అనంతరం సుప్రియ వెండి తెరపై కనిపించనున్నారు.

గత రెండు సంవత్సరాలు రెండు విజయాలతో సందడి చేసిన శేష్‌ ఈ ఏడాది కూడా విజయాన్నందుకుని హ్యాట్రిక్ సాధిస్తారేమో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.