close
Choose your channels

మ‌రో ద‌క్షిణాది రీమేక్‌కు సై అన్న అక్ష‌య్‌

Thursday, August 1, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌రో ద‌క్షిణాది రీమేక్‌కు సై అన్న అక్ష‌య్‌

వ‌రుస స‌క్సెస్‌ల‌తో బాక్సాఫీస్ వద్ద స‌త్తా చాటుతున్న బాలీవుడ్ హీరో అక్ష‌య్‌కుమార్. రీసెంట్‌గా అజిత్ హీరోగా నటించిన `వీర‌మ్‌` చిత్రాన్ని `బ‌చ్చ‌న్ పాండ్య‌న్` పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను ఇటీవ‌ల విడుద‌ల చేశారు. కాగా ఇప్పుడు మ‌రో కోలీవుడ్ హీరో విజ‌య్ సినిమాకు అక్ష‌య్‌కుమార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

వివ‌రాల్లోకెళ్తే.. విజ‌య్ హీరోగా ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `క‌త్తి`. ఈ చిత్రాన్ని హిందీలో వ‌యాకామ్ స్టూడియోస్ రీమేక్ చేయ‌నుంది. అక్ష‌య్‌కుమార్‌తో `మిష‌న్ మంగ‌ల్‌` సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు జ‌గ‌న్ శ‌క్తి ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నార‌ని టాక్‌. గ‌తంలోనూ విజ‌య్‌. మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందిన `తుపాకి` చిత్రాన్ని `హాలీడే` పేరుతో రీమేక్ చేయ‌గా.. అందులోనూ అక్ష‌య్‌కుమారే హీరోగా న‌టించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.