close
Choose your channels

మలయాళంలో ఎంట్రీ ఇస్తున్న అల్లు శిరీష్..!

Saturday, October 22, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అన్న‌య్య స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ వ‌లే టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ ఇప్పుడు మ‌ల‌యాళంలో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మ‌ల‌యాళ అగ్ర‌హీరో మోహ‌న్ లాల్ న‌టిస్తున్న తాజా చిత్రం 1971. ఈ చిత్రం ద్వారా అల్లు శిరీష్ మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అవుతున్నారని స‌మాచారం. 1971 ఇండో - పాక్ వార్ నేప‌థ్యంతో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో అల్లు శిరీష్ ఓ ముఖ్య‌పాత్ర పోషిస్తున్నారు. రాజ‌స్ధాన్, పంజాబ్ బోర్డ‌ర్స్ లో ఈ చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని మేజ‌ర్ ర‌వి తెర‌కెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని అల్లు అర్జున్ కాస్త మ‌ల్లు అర్జున్ అయ్యారు. మ‌రి...అల్లు శిరీష్ మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.