close
Choose your channels

18 ఏళ్ల త‌ర్వాత అవార్డ్‌

Monday, March 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

18 ఏళ్ల త‌ర్వాత అవార్డ్‌

సాధార‌ణంగా నెటివిటీకి ద‌గ్గ‌ర‌గా ఉన్న సినిమాల‌ను తెర‌కెక్కించిన సినీ చిత్ర సీమ‌ల్లో త‌మిళ సినీ ఇండ‌స్ట్రీ ఎప్పుడూ ఉంటుంది. గ‌త ఏడాది కోలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను న‌మోదు చేసుకున్న చిత్రాల్లో '96' సినిమా ఒక‌టి. విజ‌య్ సేతుప‌తి, త్రిష జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి సి.ప్రేమ్‌కుమార్ ద‌ర్శ‌కుడు. ఈ `96` సినిమాకు ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

తాజాగా ఈ సినిమా ద‌ర్శ‌కుడు సి.ప్రేమ్‌కుమార్‌కు గొల్ల‌పూడి శ్రీనివాస్ అవార్డ్ ద‌క్కింది. ఆగ‌స్ట్ 12న జ‌ర‌గ‌బోయే 22వ‌ గొల్ల‌పూడి శ్రీనివాస్ అవార్డుల కార్య‌క్ర‌మంలో ల‌క్ష‌న్న‌ర రూపాయ‌ల న‌గ‌దు, మెమొంటోను ద‌ర్శ‌కుడికి అంద‌చేస్తున్నారు.

గొల్ల‌పూడి మారుతీరావు ప్ర‌మాదంలో చ‌నిపోయిన త‌న కుమారుడు గొల్ల‌పూడి శ్రీనివాస్ జ్ఞాపకార్థం ఈ అవార్డును అంద‌చేస్తున్నారు. ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే.. ఓ త‌మిళ సినిమాకు అవార్డు వ‌చ్చి 18 ఏళ్ల‌య్యింది. 2001లో కుట్టి అనే త‌మిళ సినిమాకు ఈ అవార్డ్ ద‌క్కింది. ఇన్నేళ్ల త‌ర్వాత ఇప్పుడే మ‌రోసారి త‌మిళ సినిమాకు ఈ అవార్డ్ రావ‌డం గ‌మ‌నార్హం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.