close
Choose your channels

క‌ల్యాణ్ రామ్‌తో కాలు క‌దుపుతున్న బాలయ్య భామ‌

Wednesday, November 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క‌ల్యాణ్ రామ్‌తో కాలు క‌దుపుతున్న బాలయ్య భామ‌

బాబాయ్ బాల‌కృష్ణ‌తో `జై సింహా` సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌లో ఒక‌రుగా న‌టించిన ముద్దుగుమ్మ న‌టాషా దోషి. ఈ సినిమా విడుద‌లై రెండేళ్లు దాటుతున్నా కూడా మ‌రో తెలుగు సినిమాలో అవ‌కాశాన్ని అందిపుచ్చుకోలేదు. అయితే చాలా గ్యాప్ త‌ర్వాత అబ్బాయి నంద‌మూరి క‌ల్యాణ్‌తో ఈ సొగ‌స‌రి ఓ స్పెష‌ల్ సాంగ్‌లో కాలు క‌ద‌ప‌నుంద‌ట‌. వివ‌రాల్లోకెళ్తే.. క‌ల్యాణ్ రామ్ హీరోగా స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న చిత్రం `ఎంత మంచివాడ‌వురా`.

ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జ‌న‌వ‌రి 15న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్‌ను చిత్రీక‌రించాల్సి ఉంది. ఈ సాంగ్‌లో న‌టాషా దోషి న‌టించ‌బోతుంద‌ని టాక్. చాలా రోజులుగా తెలుగులో మంచి బ్రేక్ కోసం వేచి చూస్తున్న న‌టాషా దోషికి మ‌రి `ఎంత‌మంచివాడ‌వురా` ఎలా హెల్ప్ అవుతుందో వేచి చూడాలి.

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో ఆదిత్య‌మ్యూజిక్‌, శ్రీదేవి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.