close
Choose your channels

Bharat Rice:రూ.29లకే 'భారత్ రైస్' విక్రయాలు ప్రారంభం.. ఎక్కడ కొనుగోలు చేయాలంటే..?

Tuesday, February 6, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరిగిన వేళ తక్కువ ధరలకే బియ్యం అందించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 'భారత్ రైస్'(Bharat Rice) పేరిట రూ.29లకే కిలో బియ్యం నేటి నుంచి విక్రయించనుంది. కేంద్రమంత్రి పీయుష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

తొలి విడతలో నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED), నేషనల్ కో ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NCCF) సహా రిటైల్ చైన్ కేంద్రీయ భండార్ ద్వారా అమ్మకాలు జరపనుంది. ఈ రైస్‌ను 5 కిలోలు, 10 కిలోల బ్యాగుల్లో అందుబాటులో తీసుకువచ్చారు. ఇప్పటికే భారత్‌ గోధుమపిండి కిలో రూ.27.50, భారత్‌ శనగ పప్పును రూ.60 చొప్పున నాఫెడ్‌బజార్‌.కాం తదితర ఈ-కామర్స్‌ వేదికల్లో విక్రయిస్తున్నారు. ఈ విక్రయాలకు మంచి స్పందన వస్తుండగా.. భారత్‌ రైస్‌కు అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని కేంద్రం భావిస్తోంది.

ఈ 'భారత్ రైస్' బ్యాగులు కావాలనుకునే ప్రజలు https://www.nafedbazaar.com/product-tag/online-shopping వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఇక్కడ భారత రైస్‌తో పాటు పప్పు, శనగపిండి వంటి ఇతర ఉత్పత్తులు కూడా ఉంటాయి. ఇక్కడే కాకుండా ఇతర ఈ-కామర్స్ సైట్లలో నుంచి కూడా ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పించారు. మార్కెట్లో కంటే సగం ధరకే నాణ్యమైన బియ్యం అందిస్తుండటంతో వినియోగదారుల నుంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ డిమాండ్‌కు తగ్గట్లు దేశంలో బియ్యం నిల్వలు ఎంత మేర ఉన్నాయో వివరాలు ప్రకటించాలని ట్రేడర్లను ఆదేశించింది. తొలి దశలో 5లక్షల టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ రిటైల్ మార్కెట్ కోసం కేటాయించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.