close
Choose your channels

అనుకున్నదొక్కటి.. అయినది ఒకటి.. మెహబూబ్ ప్లాన్ రివర్స్..

Friday, October 2, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అనుకున్నదొక్కటి.. అయినది ఒకటి.. మెహబూబ్ ప్లాన్ రివర్స్..

తానేదో తలిస్తే దైవమేదో తలిచినట్టు అయింది మెహబూబ్ పని. కెప్టెన్ అవ్వాలనుకుని నైట్ అంతా నిద్ర లేకుండా కాయిన్స్‌ని పోగేసుకున్నాడు. మిగిలిన హౌస్‌మేట్స్ సాయం కూడా తీసుకున్నాడు. అందరికంటే చాలా ఎక్కువగా కాయిన్స్‌ని పోగేశాడు. కానీ చివరకు మెహబూబ్ ప్లాన్ రివర్స్ అయ్యింది. కాయిన్స్ అన్నీ సుజాత కొట్టుకుపోయింది. షో స్టార్టింగ్.. స్టార్టింగే.. సొహైల్ బాగా ఫీలయి వచ్చి అమ్మ రాజశేఖర్ చెయ్యి పట్టుకుని కూర్చొన్నాడు. నేను కాయిన్స్ మొత్తం తీయలేదు.. 320 మాత్రమే తీశానని సొహైల్ చెప్పాడు. అవినాష్‌కి నిన్న గాయం అవడంతో అవినాష్ మినహా మిగిలిన వాళ్లంతా గేమ్ ఆడాలని బిగ్‌బాస్ చెప్పారు. నోయెల్, దివి, అరియానా, అమ్మ రాజశేఖర్ అవుటయ్యారు. అయితే సుజాతను టార్గెట్ చెయ్యాలని అరియానా చెప్పడంతో.. ఆమెను టార్గెట్ చేశారు. దీంతో సుజాత కూడా అవుటయ్యింది. ఓడిపోయిన సభ్యులంతా వారి 50 శాతం కాయిన్స్‌ను తిరిగి ఇచ్చేశారు. ఇక గేమ్ ఫైనల్ లెవల్‌కు వచ్చేసింది. సొహైల్, అఖిల్ తమ కాయిన్స్‌ను మెహబూబ్‌కి ఇచ్చేశారు.

మిగిలిన వాళ్లలో అభి, హారిక మినహా మిగిలిన వాళ్లంతా కాయిన్స్‌ను అమ్మ రాజశేఖర్‌కు ఇచ్చేశారు. తరువాత సొహైల్.. అమ్మ రాజశేఖర్ దగ్గరికి వెళ్లాడు. దీంతో అమ్మ రాజశేఖర్ నా దగ్గర కొట్టేసిన కాయిన్స్ అన్నీ తనకు ఇచ్చేయమన్నారు. మెహబూబ్.. ఇవ్వొద్దంటూ సొహైల్‌కు బ్రెయిన్ వాష్ చేశాడు. హౌస్ మొత్తం రెండు గ్రూపులుగా విడిపోయింది. స్పెషల్ పవర్ కలిగిన స్విచ్ కాయిన్ సుజాత దగ్గర ఉండటంతో బిగ్‌బాస్ స్పెషల్ పవర్ ఇచ్చారు. వేరే వాళ్ల కాయిన్స్‌తో స్విచ్ చేసుకునే అధికారం బిగ్‌బాస్ సుజాతకు ఇచ్చారు. దీంతో సుజాత మెహబూబ్ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ తీసుకుంది. దీంతో సుజాత, అమ్మ రాజశేఖర్, కుమార్ సాయి, హారిక కెప్టెన్సీ టాస్క్‌కు ఎంపికయ్యారు. దరిద్రపు ట్రయాంగిల్ అని.. అది బయట మమ్మీ వాళ్లు చూసినా బాగుండదని దివి, హారికలకు అభి చెబుతున్నాడు. ఇక అమ్మ రాజశేఖర్‌, సొహైల్‌ల మధ్య గొడవ. నాకు కాయిన్స్ ఇవ్వలేదని అమ్మ రాజశేఖర్ ఫైర్ అయ్యారు.

ఆ తరువాత అభి, సొహైల్‌ల మధ్య చర్చ జరిగింది. అభి కూడా నీదే తప్పు అన్నట్టుగా సొహైల్‌కి చెప్పాడు. కెప్టెన్సీ టాస్క్ ప్రారంభమైంది. బురదలో ఉన్న కాయిన్స్‌ని తీసి బుట్టలో వేయాలి. కెప్టెన్సీ టాస్క్‌లో కుమార్ విన్ అయ్యాడు. దీంతో కుమార్‌ను తదుపరి నామినేషన్స్ నుంచి తప్పించి బిగ్‌బాస్ సేఫ్ జోన్‌లోకి పంపించారు. దివిని గంగవ్వ గిన్నెలు తోమమంటే.. నేను తోమనని చెప్పి వచ్చి.. సైలెంట్‌గా ఫిట్టింగ్ పెడుతున్నారంటూ అభికి కంప్లైంట్ చేసింది. అఖిల్, స్వాతి మాట్లాడుకుంటుంటే.. దానికి అవినాష్ లిప్ రీడింగ్ చేసి వాళ్లేం మాట్లాడుకుంటున్నారో చెప్తున్నాడు. గంగవ్వ హౌస్‌లో జరిగిందాని గురించి ఫన్నీగా చెప్పింది. మొత్తమ్మీద హౌస్‌లో తెలియకుండానే రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. అలాగే అభిజిత్, అఖిల్‌ల మధ్య కోల్డ్ వార్ బాగా నడుస్తున్నట్టు అనిపిస్తోంది. అమ్మ రాజశేఖర్, సొహైల్‌ల మధ్య గొడవ తప్ప నేటి షోలో పెద్దగా చెప్పుకోదగిన విశేషాలంటూ ఏమీ లేవు. ఇవాళ్టితో గంగవ్వ కెప్టెన్సీ ముగిసిపోయింది కాబట్టి రేపటి నుంచి ఆమె గేమ్ ఎలా ఆడుతుందో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.