close
Choose your channels

Rohit Shetty : షూటింగ్‌లో ప్రమాదం, బాలీవుడ్ డైరెక్టర్‌ రోహిత్ శెట్టికి గాయాలు.. హుటాహుటిన హాస్పిటల్ కి

Saturday, January 7, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాలీవుడ్ దర్శక నిర్మాత రోహిత్ శెట్టి షూటింగ్‌లో గాయపడ్డారు. హైదరాబాద్ శివార్లలో జరుగుతున్న షూటింగ్‌లో ఆయన ప్రమాదానికి గురయ్యారు. దీంతో చిత్రం చిత్ర యూనిట్ రోహిత్ శెట్టిని వెంటనే ఎల్‌బీ నగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఓ కారు ఛేజింగ్ సీన్‌ను తెరకెక్కిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.

వెబ్ సిరీస్ షూటింగ్ కోసం హైదరాబాద్‌కి :

రోహిత్ శెట్టి ఇండియన్ పోలీస్ ఫోర్స్ పేరుతో ఒక వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ గత కొన్నిరోజులుగా హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ వెబ్ సిరీస్ లో సిద్ధార్థ్ మల్హోత్రా , శిల్పా శెట్టి , ఇషా తల్వార్, విభూతి తల్వార్, నికితిన్ ధీర్, శ్వేతా తివారిలు నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ త్వరలో స్ట్రీమింగ్ కానుంది.

17 ఏళ్లకే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రోహిత్ శెట్టి:

కాగా.. రోహిత్ శెట్టి 17 ఏళ్ల చిరుప్రాయంలోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కిన పూల్ ఔర్ కాంటే చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. దర్శకత్వ శాఖలో ఓనమాలు దిద్దిన అనంతరం ఆయన అజయ్ దేవగణ్‌తోనే తన తొలి చిత్రాన్ని డైరెక్ట్ చేశారు అదే జమీన్. తర్వాత మళ్లీ అజయ్‌తోనే గోల్‌మాల్, సండే, గోల్‌మాల్ రిటర్న్స్, అల్ ది బెస్ట్ ఫన్ బిగిన్స్ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించి బాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్స్‌లో ఒకరిగా నిలిచారు. ఆయనకు భార్య మాయా శెట్టి, కుమారుడు ఇషాన్ రోహిత్ శెట్టిలు వున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.