శ్రీదేవి బయోపిక్‌కి బోనీ నిర్మాత

  • IndiaGlitz, [Monday,January 07 2019]

జాతీయ స్థాయిలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఒకరు అందాల తార శ్రీదేవి. దక్షిణాది చిత్రాలతోపాటు హిందీలోనూ పలు సూపర్‌హిట్ చిత్రాల్లో నటించిన ఆమె హఠాత్తుగా చనిపోవడం అందర్నీ బాధించింది. దేశవ్యాప్తంగా చక్కని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆమె జీవితాన్ని తెరకెక్కించేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే వాళ్ళందరి కంటే శ్రీదేవి బయోపిక్‌ను నిర్మించే అర్హత తనకే ఉందని ఆమె భర్త బోనీకపూర్ భావిస్తున్నారు. శ్రీదేవి బయోపిక్‌ను తియ్యాలన్న ఆలోచన బోనీ కపూర్‌ది. ఆ దిశగా ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు.

శ్రీదేవి గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి బోనీ కపూర్ కావడంతో ఆ సినిమాకు అతని వల్లే న్యాయం జరుగుతుంది. ఆమె జీవితంపై సినిమా తీసేందుకు కాపీ రైట్స్ కూడా ఆయనే తీసుకోబోతున్నారు అని బోనీ కపూర్ సన్నిహిత వర్గాలు చెప్పినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. శ్రీదేవి జీవితాన్ని పుస్తక రూపంలో తీసుకురావడానికి పలువురు రచయితలు, పాత్రికేయులు బోనీని కలిశారట. వారిలో ఒకరికి ఆ బాధ్యతను అప్పగిస్తున్నారని సమాచారం.

More News

గోల్డెన్ గ్లోబ్ అవార్డుల సందడి

76వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల సందడి ప్రారంభమైంది. సోమవారం ఉదయం కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్స్ ప్రాంతంలో ఈ వేడుక జరిగింది. హాలీవుడ్‌కి చెందిన సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

మాజీ ప్ర‌ధానికి ఊర‌ట‌

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది.

అక్కడ రాశి హవా!

తెలుగులో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న రాశీ ఖన్నా ఇప్పుడు తమిళ సినిమాల్లో ఎక్కువగా నటిస్తోంది. ఈమధ్య ఆమె నటించిన రెండు సినిమాలు విజయం సాధించాయి.

'పి.ఎం.నరేంద్ర మోదీ' ఫస్ట్ లుక్

ప్రస్తుతం ఇండియన్ సినిమాలో బయోపిక్స్ ట్రెండ్ జోరుగా కొనసాగుతుంది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల బయోపిక్స్ రూపొందుతున్నాయి.

క‌మ‌ల్‌తో దక్షిణ కొరియా భామ

కమ‌ల్‌హాసన్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం 'ఇండియన్ 2'. 22 ఏళ్ల తర్వాత వీరి కలయికలో రాబోతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తోంది.