close
Choose your channels

బూతులు తిట్టాడని ఆహుతీ ప్రసాద్‌ కొడుకుపై కేసు

Thursday, June 6, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బూతులు తిట్టాడని ఆహుతీ ప్రసాద్‌ కొడుకుపై కేసు

టాలీవుడ్ సీనియర్ నటుడు ఆహుతీ ప్రసాద్ కుమారుడు కార్తీక్ ప్రసాద్‌పై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆర్కే సినిప్లెక్స్ పీవీఆర్‌లో ఈరోజు విడుదలైన ‘హిప్పీ’ సినిమాకు కార్తిక్ వెళ్లాడు. అయితే హాల్‌లో సినిమా మొదలయ్యే ముందు ‘జాతీయ గీతం’ వచిన్నపుడు అందరూ సీట్లలో నుంచి లేచి నిలబడగా.. కార్తీక్ మాత్రం నిలబడకుండా అలానే కూర్చొన్నాడు. దీంతో ఆయన పక్కనే ఉన్న వ్యక్తి శ్వేతా హర్ష.. జాతీయ గీతం వచిన్నపుడు ఎందుకు నిలబడలేదు..? అని కార్తీక్‌ను ప్రశ్నించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కార్తీక్.. మాటలకు చెప్పలేని బూతులు తిట్టాడని హర్ష చెబుతున్నాడు. దీంతో సినిమా హాల్ నుంచి నేరుగా బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రహించిన హర్ష పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆహుతీ ప్రసాద్ 2015 జనవరి 04న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.