close
Choose your channels

ఆసుపత్రులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

Sunday, May 9, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భారత్‌లో కరోనా మహమ్మారి పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. లక్షల్లో జనం కొవిడ్ బారిన పడుతున్నారు. దీంతో ఆసుపత్రులు సైతం చేతులెత్తేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం రంగంలోకి దిగింది. కరోనా బాధితులను ఆస్పత్రుల్లో చేర్చుకోడానికి సంబంధించి కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. బాధితుల వద్ద కరోనా పాజిటివ్ ధృవపత్రం లేకున్నా ఆస్పత్రిలో చేర్చుకుని వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. లక్షణాలు కనిపిస్తే ధృవీకరణ పత్రంతో సంబంధం లేకుండా కరోనా అనుమానిత కేసులుగా పరిగణించి ఆసుపత్రిలో చేర్చుకుని తక్షణమే వైద్యం అందించాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.

అంతేకాదు.. వ్యక్తిలోని కొవిడ్ స్థాయిని బట్టి కోవిడ్ కేర్ సెంటర్, డెడికేటెడ్ కోవిడ్ హెల్త్ సెంటర్, డెడికేటెడ్ కోవిడ్ ఆస్పత్రులలో చేర్చుకుని వెంటనే చికిత్స అందించాలని సూచించింది.
ఏదో ఒక కారణం చెప్పి రోగికి వైద్యసేవలు నిరాకరించడానికి ఇకపై వీల్లేదని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. వేరే నగరానికి చెందిన రోగైనా ఆక్సిజన్, అత్యవసర మందులు అందించాలని ఆసుపత్రులకు సూచించింది. రోగి స్థానిక గుర్తింపు కార్డు చూపించలేదన్న కారణంతో ఆస్పత్రిలో చేర్చుకోకుండా ఉండేందుకు వీల్లేదని వైద్య ఆరోగ్యశాఖ తేల్చి చెప్పింది.

అవసరం, ప్రాతిపదిక ఆధారంగా మాత్రమే ఆస్పత్రిలో ప్రవేశం కల్పించాలని సూచించింది. ఈ క్రమంలోనే అనవసరమైన వారితో పడకలను నింపేయవద్దని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్త పాలసీకి అనుగుణంగా రోగులను డిశ్చార్జ్ చేయాలని ఆస్పత్రులకు సూచించింది. ఈ కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మూడు రోజులలోపు స్థానిక ఆస్పత్రులకు ఉత్తర్వులు జారీచేయాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. కోవిడ్ కేర్ సెంటర్‌లను వీలైనన్ని ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. ప్రైవేటు ఆసుపత్రులను సైతం కొవిడ్ డెడికేటెడ్ ఆసుపత్రులుగా వినియోగించుకోవచ్చని సూచించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.