close
Choose your channels

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి నిర్మాతగా మల్టీస్టారర్

Thursday, February 2, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఖైదీ నంబర్ 150 చిత్రంతో తెలుగు చిత్ర‌సీమ‌లోకి రీ ఎంట్రీ ఇచ్చి సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబినేష‌న్‌లో స్టార్ రైట‌ర్‌, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో టి.సుబ్బరామిరెడ్డి నిర్మాత‌గా మ‌ల్టీస్టార‌ర్ రూపొంద‌నుంది. గ‌తంలో టి.సుబ్బ‌రామిరెడ్డి నిర్మాత‌గా శోభ‌న్‌బాబు, చిరంజీవి, ర‌జ‌నీకాంత్ వంటి స్టార్ హీరోస్‌తో సూప‌ర్‌హిట్ మూవీస్ చేశారు. సుబ్బ‌రామిరెడ్డి నిర్మాత‌గా జీవ‌న పోరాటం, స్టేట్ రౌడీ, గ్యాంగ్ మాస్ట‌ర్‌, భ‌గ‌వ‌ద్గీత వంటి చిత్రాల‌ను రూపొందించారు. రీసెంట్‌గా చిరంజీవి ఖైదీ నంబ‌ర్ 150 సినిమా స‌క్సెస్ సందర్భంగా చిరంజీవిని స‌న్మానించిన క‌ళాబందు టి.సుబ్బరామిరెడ్డి మెగా హీరోల‌తో మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేస్తాన‌ని అన్నారు.

అన్న‌ట్లుగానే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివ‌రాల‌ను సీనియ‌ర్ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి అధికార‌కంగా అనౌన్స్ చేశారు. ఈ సంద‌ర్భంగా టి.సుబ్బ‌రామిరెడ్డిమాట్లాడుతూ - ``మెగాస్టార్ చిరంజీవిగారు న‌టించిన 150వ చిత్రం ఖైదీ నంబ‌ర్ 150 సినిమా చూసిన త‌ర్వాత నేను నిర్మాణ రంగంలోకి రావాల‌నుకుని నిర్ణయం తీసుకున్నాం. చిరంజీవిగారు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వంటి స్టార్ హీరోల‌ను డైరెక్ట్ చేయ‌గ‌ల డైరెక్ట‌ర్ ఎవ‌రా అని ఆలోచించాను. త్రివిక్ర‌మ్ అయితే స‌రిపోతాడ‌ని భావించాను. అంద‌రితో డిస్క‌స్ చేసిన త‌ర్వాత ఈ సినిమాను అధికార‌కంగా ప్ర‌క‌టిస్తున్నాను. అలాగే భారీ బ‌డ్జెట్‌తో రూపొంద‌నున్న ఈ సినిమాను మ‌రో స్టార్ ప్రొడ్యూస‌ర్ సి.అశ్వ‌నీద‌త్‌గారితో క‌లిసి నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉంది`` అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.