close
Choose your channels

ప్రధాని మోదీపై పోటీ చేస్తానంటున్న కమెడియన్.. ఎందుకో తెలుసా..?

Thursday, May 2, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రధాని మోదీపై పోటీ చేస్తానంటున్న కమెడియన్.. ఎందుకో తెలుసా..?

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి సినీ, క్రీడా ప్రముఖులు కూడా పోటీ చేస్తున్నారు. మరోవైపు సామాన్యులు కూడా కీలక నేతలపై స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దిగుతున్నారు. ఇప్పుడు ఈ కోవలోనే కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ శ్యామ్ రంగీలా(Shyam Rangeela) చేరాడు. ఏకంగా ప్రధాని మోదీపైనే వారణాసి నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించి సంచలనంగా మారాడు. ముఖ్యంగా ప్రధానిపై బరిలోకి దిగడానికి ప్రత్యేక కారణం ఉందని శ్యామ్ రంగీలా తెలిపాడు.

"లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన తర్వాత మీ అందరి నుంచి నాకు లభిస్తున్న ప్రేమను చూసి నేను సంతోషిస్తున్నాను. వారణాసి చేరుకున్న తర్వాత నా నామినేషన్, ఎన్నికల్లో పోటీ చేయడంపై నా అభిప్రాయాలను వీడియో ద్వారా త్వరలో మీకు తెలియజేస్తాన”ని పేర్కొన్నాడు. గతంలో మోదీకి మద్దతుగా ప్రచారం చేశానని కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. 2014లో ప్రధాని మోదీకి నేను ఫాలోయర్‌ని. ఆయనకు మద్దతుగా రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్‌లకు వ్యతిరేకంగా కూడా వీడియోలు షేర్ చేశాను. ఆ వీడియోలు చూసినవారెవరైనా.. వచ్చే 70 ఏళ్లు బీజేపీ మాత్రమే నేను ఓటేస్తానమో అనుకుంటారు. కానీ గత 10 ఏళ్లలో పరిస్థితి మారింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రిపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను. సూరత్, ఇండోర్‌లా ఏకగ్రీవం కాకుండా.. వారణాసిలో ఓటు వేసే ప్రజలకు నేను మరో ఆప్షన్ అవుతాను. నేను ఈ వారం వారణాసికి వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తాను" వెల్లించాడు.

ప్రధాని మోదీపై పోటీ చేస్తానంటున్న కమెడియన్.. ఎందుకో తెలుసా..?

కాగా సూరత్‌ నియోజకవర్గంలో ముఖేష్ దలాల్.. ఇండోర్ నియోజకవర్గం నుంచి శంకర్ లాల్వానీ.. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే వీరిద్దరు బీజేపీకి చెందిన నేతలు కావడం గమనార్హం. అందుకే ప్రధాని ఎన్నికల కూడా ఏకగ్రీవం కాకుండా ఉండేందుకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు శ్యామ్ ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రధాని మోదీ వాయిస్‌ని మిమిక్రి చేసి శ్యామ్ పాపులర్ అవ్వడం విశేషం.

ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ జరుగుతుండగా.. ఇప్పటికే రెండు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నెల 7వ తేదీన మూడో విడత పోలింగ్ జరగనుంది. ఇక వారణాసిలో చివరి విడతలో భాగంగా జూన్ 1వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెల్లడి కానున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.