కాంగ్రెస్కు మరో రేవంత్ దొరికినట్లేనా..!?
Send us your feedback to audioarticles@vaarta.com
2018 ముందస్తు ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కలలో కూడా ఊహించని రీతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆయనుండింటే కాంగ్రెస్కు ఓ బలమైన శక్తి ఉండేది.! ఒకప్పుడు రేవంత్ అసెంబ్లీలో మాట్లాడితే సంచలనమే.. కౌంటర్ ఎటాక్ చేయడంలోనూ ముందుండే వారు. అయితే ఆయన లేకపోవడంతో అసెంబ్లీ అంతా బోసిపోయినట్లైంది. దీంతో ఉన్న కొద్దిమందిమైనా అధికారపార్టీని స్ట్రాంగ్గా ఎదుర్కోవాలని స్ట్రాంగ్గా ఉన్నారు. రేవంత్ తర్వాత ఆ రేంజ్లో మాట్లాడే ఎమ్మెల్యేల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భట్టీ విక్రమార్క, సుధీర్ రెడ్డి, శ్రీధర్ బాబులే అని చెప్పుకోవచ్చు.
వీరిలో ఎక్కువగా వినిపించే పేరు భట్టీ, సుధీర్ మాత్రమే. సుధీర్ రెడ్డి గత రెండ్రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ మొదలుకుని ఆ పార్టీ ఎమ్మెల్యేలు సంధించిన ప్రశ్నలు.. కౌంటర్లకు గట్టిగానే రియాక్టవుతూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. మరోవైపు భట్టీకి సీఎల్పీ ఇవ్వడంతో కాంగ్రెస్ స్వరం గట్టిగా వినిపిస్తున్నారు. వీరిద్దరి పేర్లు ఎక్కువగా వినపడుతున్నాయి.
మొత్తానికి చూస్తే వాగ్దాటి, కౌంటర్లు ఇచ్చేందుకు కాంగ్రెస్కు రేవంత్ దొరికిందన్నమాట. అయితే వీళ్లు అధికార పార్టీని ఎదుర్కోవడంలో ఏ మేరకు ప్రయ్నాలు చేస్తారో..? వీళ్ల స్టామినా ఏంటి..? అధికార పార్టీని తిప్పికొట్టగలారా? టీఆర్ఎస్ను ఢీ కొట్టి ఏ మేరకు సక్సెస్ అవుతారో తెలియాలంటే మొదటి అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.