close
Choose your channels

వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

Tuesday, June 23, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

శృంగవరపుకోట వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరావుకి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. ఏపీలో కరోనా సోకిన తొలి ఎమ్మెల్యే ఆయనే కావడం గమనార్హం. కరోనా లక్షణాలతో బాధపడుతున్న శ్రీనివాసరావుకు ట్రూనాట్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. లాక్‌డౌన్‌కు ముందు అమెరికా వెళ్లిన ఆయన ఈ నెల 10న తిరిగి వచ్చారు. కాగా వచ్చిన వెంటనే పరీక్షలు చేయించుకోగా.. ఆయనకు నెగిటివ్ వచ్చింది. కాగా తాజాగా నిర్వహించిన టెస్టులో శ్రీనివాసరావుకి పాజిటివ్ అని తేలింది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పలువురు నేతలను కలిశారు. ప్రస్తుతం శ్రీనివాసరావుకి పాజిటివ్ రావడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.