close
Choose your channels

షాకింగ్: రోజాకు మంత్రి పదవి దక్కకుండా చేసింది ఆ ఇద్దరేనా!?

Wednesday, July 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

షాకింగ్: రోజాకు మంత్రి పదవి దక్కకుండా చేసింది ఆ ఇద్దరేనా!?

అవును మీరు వింటున్నది నిజమే.. వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్‌ రోజాకు మంత్రి రాకపోవడం వెనుక ఆ ఇద్దరే కారణమని తెలుస్తోంది. రోజాకు మంత్రి పదవి పక్కాగా వస్తుందని.. ఆమెకు రాకపోతే అసలు పరిస్థితులు మామూలుగా ఉండవని.. జగన్ ఆమెకు అన్యాయం చేయరని కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని.. కేబినేట్ విస్తరణకు గంట ముందు కూడా అందరికీ నమ్మకం ఉన్నది.. ‘రోజా అనే నేను..’ అనే మాట కోసం అభిమానులు ఎన్నో ఆశలతో వేచి చూశారు. అయితే ఆ ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఇంతకీ రోజాకే ఎందుకిలా జరిగింది..? దీని వెనుక ఉన్న ఆ ఇద్దరు ఎవరు..? రోజాకు మంత్రి పదవి వస్తే వారికి పొంచి ఉన్న ఇబ్బందులేంటి..? ఆమెకు మంత్రి పదవి రాకపోతే ఆ ఇద్దరికి ఒరిగేంటి..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

మంత్రి వర్గ ఏర్పాటుకు గంట ముందు కూడా..!

రోజా.. రోజా.. ఎన్నికల సీజన్ మొదలైన నాటి నుంచి మంత్రి వర్గ ఏర్పాటు వరకు ఎక్కడా చూసినా ఈ పేరు మార్మోగింది. వైసీపీ అధికారంలోకి వస్తే రోజాకు ఎవరూ ఊహించని రీతిలో మంత్రి పదవి వస్తుందని పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. రోజా.. ఆమె అభిమానులు ఎంతగానే ఎదురుచూశారు. డ్యామిట్ చివరికి కథ మొత్తం అడ్డం తిరిగింది. చివరికి మంత్రి పదవి రాకపోవడంతో కనీసం మంత్రులుగా ప్రమాణం స్వీకరోత్సవానికి కూడా రాకుండా తీవ్ర అసంతృప్తితో రోజా తిరుగుబాటు చేశారు. అయితే రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పడంతో రాజా మనసు కాస్త కుదుటపడిందని చెప్పుకోవచ్చు.

ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు..?

రోజాకు మంత్రి పదవి రాకపోవడం వెనుక ప్రస్తుతం జగన్ కేబినెట్‌లోని ఓ సీనియర్ మంత్రి, ఎంపీగా ఉన్న ఆయన కుమారుడు ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ మంత్రి కుటుంబానికి జగన్ బాగా గౌరవం ఇస్తారని.. ఆమెకు ఈ టెర్మ్‌లో మంత్రి పదవి వద్దని పదే పదే జగన్ దగ్గర మొరపెట్టుకున్నారట. ఇది మొదట కారణం. మరోవైపు సామాజిక వర్గం పరంగా చూస్తే.. రోజాకు కలిసిరాలేదన్నది కూడా రెండో కారణం.

రోజా స్థానంలో తీసుకున్నది ఆయన్నే!

రోజాకు మంత్రి పదవి దక్కకపోవడంతో మేకపాటి ఫ్యామిలీకి లైన్ క్లియర్ అయినట్లైంది. వాస్తవానికి మేకపాటికి ఎంపీ టికెట్ ఇవ్వలేదు.. పైగా సీనియర్ నేత కష్టకాలంలోనూ పార్టీకి అండగా ఉంటూ వచ్చిన నేత కావడంతో కచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలని భావించిన వైఎస్ జగన్.. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గౌతమ్‌రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకుని కీలక శాఖ అప్పగించడం జరిగింది.

సో.. మొత్తానికి చూస్తే రోజాకు మంత్రి పదవి రాకపోవడం వెనుక పెద్ద కథే నడించిందని దీన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పాపం ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రోజా చాలా బాధ పడ్డారట. నామినెటెడ్ పదవుల్లో అయినా రోజాకు న్యాయం జరుగుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.