బాలీవుడ్ హీరోయిన్తో గోపీచంద్
- IndiaGlitz, [Monday,January 21 2019]
బాలీవుడ్ హీరోయిన్స్, నటీనటులను టాలీవుడ్లో నటింప చేసే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తెలుగు సినిమాల్లోనటించడానికి వారు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ జరీనా ఖాన్ తెలుగులో ఎంట్రీ ఇవ్వనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. వివరాల్లోకెళ్తే.. ప్రస్తుతం అనీల్ సుంకర్ నిర్మాణంలో గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
రాజస్థాన్లోని జైపూర్లో 45 రోజుల పాటు యాక్షన్ ఎపిసోడ్స్ సహా కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. గోపీచంద్ 25వ చిత్రం 'పంతం' తర్వాత గోపీచంద్ చేస్తున్న చిత్రమిది. భారీ బడ్జెట్తో సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నారు నిర్మాతలు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ జరీనా ఖాన్ను హీరోయిన్గా తీసుకోవాలని ఆమెతో చర్చలు జరుపుతున్నారట. అంతా ఓకే అయితే జరీనా ఖాన్ నటించే తెలుగులోకి ఎంట్రీ ఇస్తుందన్నమాట.