‘టిక్‌టాక్‌’లో వీడియోలు చేస్తోందని భార్యను చంపేశాడు!

  • IndiaGlitz, [Sunday,June 02 2019]

రోజురోజుకు పెరుగున్న టెక్నాలజీతో ఎన్ని లాభాలున్నాయో.. అంతకు రెట్టింపు నష్టాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా యాప్‌లు అయితే పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేశాయి. కొన్ని యాప్‌ల వల్ల జనాలు ప్రాణాలు మీదికి తెచ్చుకున్న సందర్భాలు కోకొల్లలు. కాగా ఈ మధ్య విపరీతంగా పాపులర్ అయిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ‘టిక్ టాక్’. సినిమాల్లోని పాటలు.. డ్యాన్స్‌లు చేస్తూ నానా హంగామా చేసేస్తున్నారు. మరికొందరైతే మత పరమైన విధ్వంసాలు, హింసను ప్రేరేపించేలా ‘టిక్‌టాక్’లో వీడియోలను తయారు చేస్తున్నారు. మరికొందరు 24/7 ఈ టిక్ టాక్ వీడియోలతో గడిపేస్తున్నారు. దీంతో కుటుంబాల్లో వివాదాలు సైతం తలెత్తాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ యాప్‌ను బ్యాన్ చేయగా.. మరికొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించాయి.

ఇదిలా ఉంటే తాజాగా.. టిక్ టాక్‌లో భార్య వీడియోలు చేస్తోందని.. తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని కోవై సమీపంలో చోటుచేసుకుంది. అరివొలినగర్‌కు చెందిన కనకరాజ్‌ (35) బిల్డింగ్‌లు కట్టే కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. అతని భార్య నందిని(28) స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తోంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే కుటుంబ తగాదాల కారణంగా కనకరాజు, నందిని రెండేళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే నందిని కొన్ని నెలలుగా ‘టిక్‌టాక్‌’కు బానిసగా మారి రోజూ వీడియోలు చేస్తూ పోస్ట్ చేసేది.

దీంతో ఆమె వీడియోలకు పెద్ద ఎత్తున లైక్స్.. ఫాలోవర్ల సంఖ్య కూడా విపరీతంగా పెరగిపోయింది. అయితే ఈ వీడియోలు చూసిన భర్త విసుగుచెంది.. ఆమెకు ఫోన్ చేసి ‘టిక్‌టాక్’ వీడియోలు చేయొద్దంటూ పలుమార్లు హెచ్చరించాడు. వీడియోలు చేయడం మాని ఇంటికొచ్చి కాపురం చేయాలని కోరాడు. అయితే భర్త మాటలను పట్టించుకోకుండా ఆమె ‘టిక్ టాక్’ వీడియోలతోనే పబ్బం గడిపేస్తోంది. దీంతో ఆగ్రహించిన భర్త కనకరాజ్‌ మద్యం సేవించి నందినికి ఫోన్ చేశాడు.

ఆ సమయంలో నందిని ఫోన్ బిజీ అని వస్తుండడంతో.. భార్య పని చేస్తున్న కళాశాలకి వచ్చి గొడవపడ్డాడు. అది కాస్త ఘర్షణకు దారిదీయడంతో తీవ్ర ఆగ్రహంతో తన వెంట తెచ్చుకున్న కత్తి తీసి నందిని దారుణంగా హత్య చేశాడు.  దీంతో నందిని తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే చనిపోయింది.

నందిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కనకరాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సో.. ఇలాంటి యాప్‌లకు బానిస కావడం వల్ల నష్టమే కానీ పైసా ప్రయోజనం లేదని తెలుసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

More News

వైసీపీ తరఫున పోటీ చేయలేకపోయిన డైరెక్టర్!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 పార్లమెంట్ స్థానాలు దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

చైర్మెన్ పదవి కోసం జయసుధ, అలీ, పృథ్వీ పోటాపోటీ!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నవ్యాంధ్ర సీఎంగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా త్వరలో కేబినెట్ విస్తరణ జరగనుంది.

`ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌` సెన్సార్ పూర్తి.. జూన్ 21న విడుద‌ల‌

న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌`.

సఫల రాష్ట్రంగా తెలంగాణ.. పెన్షన్ దారులు, రైతన్నలకు కేసీఆర్ శుభవార్త..

నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. జూన్-02 రాష్ట్రవ్యాప్తంగా అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.

ఫ్యాన్స్‌కు ఇఫ్తార్ విందు ఇచ్చిన బ‌న్ని

టాలీవుడ్‌లో న‌యా ట్రెండ్ స్టార్ట‌య్యింది. ఇంత‌కు ఆ ట్రెండ్ ఏంటో తెలుసా..ఇఫ్తార్ విందు. ప‌విత్ర రంజాన్ మాసం సంద‌ర్భంగా ముస్లిం సోద‌రుల‌కు ఇఫ్తార్ విందు ఇస్తుంటారు.