close
Choose your channels

అభిమానులను నిరాశ పరచను:  య‌శ్‌

Saturday, June 13, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అభిమానులను నిరాశ పరచను:  య‌శ్‌

‘బాహుబ‌లి’తో ద‌క్షిణాది సినిమాల‌కు పాన్ ఇండియా రేంజ్‌లో మంచి గుర్తింపు వ‌చ్చింది. ఆ వెంట‌నే విడుద‌లైన క‌న్న‌డ చిత్రం ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 1’ కూడా పాన్ ఇండియా రేంజ్‌లో భారీ హిట్ అయ్యింది. య‌శ్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్పుడు ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’ విడుద‌ల‌కు సిద్ధమ‌వుతోంది. తొలి భాగం సక్సెస్ కావడంతో పెరిగిన అంచనాలకు ధీటుగా రెండో భాగం తెరకెక్కుతోంది. బాలీవుడ్ తారలు సంజయ్ దత్, రవీనాటాండన్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అక్టోబర్ 23న సినిమాను విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా ప్రభావంతో చిత్రీకరణ ఆగింది. ఓ ద‌శ‌లో సినిమాను డిజిట‌ల్‌లోనే విడుద‌ల చేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే అలాంటిదేమీ లేద‌ని నిర్మాత‌లు ఇది వ‌ర‌కే క్లారిటీ ఇచ్చారు. సినిమా 20 రోజుల చిత్రీక‌ర‌ణ మిగిలి ఉంద‌ని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని జూలైలో చిత్రీక‌ర‌ణ‌కు ప‌ర్మిష‌న్ దొరికినా సినిమాను అక్టోబ‌ర్‌లోనే విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. ఇదే విష‌యంపై హీరో య‌శ్ కూడా స్పందించారు. ‘‘పార్ట్ వ‌న్ పెద్ద విజ‌యం సాధించ‌డంతో అభిమానులు సినిమాపై భారీ అంచనాలు ఎర్ప‌రుచుకున్నారు. వారి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగానే సినిమా ఉంటుంది. వారిని నిరాశ ప‌ర‌చ‌ను. సినిమాను భారీ స్క్రీన్‌పై చూసేలా రూపొందిస్తున్నాం. ముందుగా సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయం’’ అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.