close
Choose your channels

నేవీ కీలక నిర్ణయం.. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లు నిషేధం

Monday, December 30, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నేవీ కీలక నిర్ణయం.. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లు నిషేధం

భారత రక్షణ దళాలను లక్ష్యంగా చేసుకొని గత కొన్ని రోజులుగా పాకిస్తాన్, చైనాతో పాటు పలుదేశాలు హనీట్రాప్‌కు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. తద్వారా ఊహించని రీతిలో నావీకి నష్టం వాటిల్లుతోంది. తాజాగా.. ట్రాప్‌లో ఏడుగురు నేవి అధికారులు చిక్కుకోవడంతో రక్షణ రంగం ఒక్కసారిగా షాకైంది. అయితే అలెర్టయిన నావీ దిద్దుబాటు చర్యలకు దిగింది. తాజాగా జరిగిన ఈ ఘటనతో నేవి కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులెవ్వరూ సోషల్ మీడియాను (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్) వాడకూడదని నిషేదాజ్ఞలు విధించింది. అంతేకాదు.. నావల్‌ బేస్‌లు, డాక్‌ యార్డులు, ఆన్‌బోర్డ్‌ వార్‌ షిప్‌లపై సిబ్బంది ఎవరూ స్మార్ట్‌ ఫోన్‌లు కూడా వాడకుండా బ్యాన్‌ విధించింది. వీటితో పాటు.. మెసేజింగ్‌ యాప్‌లు, నెట్ వర్కింగ్‌, బ్లాగింగ్‌, కంటెంట్‌ షేరింగ్‌, ఈ కామర్స్‌ సైట్లను కూడా నిషేధిత జాబితాలోకి అధికారులు తీసుకొచ్చారు. కాగా.. నేవీ చరిత్రలో అధికారులు ఇలాంటి చర్యలు తీసుకోవడం ఇదే మొదటి సారి. నేవీ వరకూ ఇవి చాలా కీలక చర్యలుగానే భద్రతాధికారులు భావిస్తున్నారు.

కాగా.. ఇలాంటి ఘటనల్లో ఏడుగురు నేవీ ఉద్యోగులతోపాటు ఓ హవాలా రాకెట్ ఆపరేటర్‌ను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. అమ్మాయిల అందచందాలను, డబ్బును ఎరగా వేసి అధికారులను బుట్టలో వేసుకొని వారి వద్ద నుంచి రక్షణరంగానికి చెందిన విలువైన సమాచారం రాబట్టేందుకు పాక్, చైనా దేశాలు విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆర్మీ, నేవీకి సంబంధించిన పలువురు ఉద్యోగులను పాక్ హనీట్రాప్ చేసి బుట్టలో వేసుకోవడంతో ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని భావించిన ఉన్నతాధికారులు నిశితంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.