close
Choose your channels

దిల్ రాజుకు తలనొప్పిగా మారిన సంక్రాంతి రిలీజులు

Monday, December 30, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దిల్‌రాజు ఒత్తిడిలో ఉన్నారా?

ప్ర‌స్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్టార్ నిర్మాత‌ల్లో దిల్‌రాజు ఒక‌రు. పెద్ద హీరోలు, చిన్న హీరోలనే తేడా లేకుండా బ్యాక్ టూ బ్యాక్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయడం ఆయ‌న‌ అలవాటు. దీనితో పాటు ఇండస్ట్రీలో బెస్ట్ జడ్జిమెంట్ ఉన్న నిర్మాతగా దిల్ రాజుకి పేరుంది. అందుకే సినిమా విడుదలకి ముందే వాటి రిజల్ట్ ని కరెక్ట్ గా జడ్జ్ చేయడం ఈ నిర్మాతకి సినిమాతో పెట్టిన విద్య. ఇప్పుడు ఈయ‌న ఒక స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నాడ‌ట‌. ఆయ‌న స‌మ‌స్య‌కు కారణం ఇద్ద‌రు స్టార్ హీరోలు.

సంక్రాంతి పోరులో నిలవబోతున్న ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రాజుకి కొత్త చిక్కులు తెచ్చి పెట్టాయి. సూపర్ స్టార్ మహేశ్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న విడుదల కానుంది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ 'అల వైకుంఠపురములో' జనవరి 12 న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పుడు ఈ రెండు సినిమాలకి థియేటర్స్ సర్దుబాటు చేయలేక సతమతవుతున్నాడట ఈ బిజీ ప్రొడ్యూసర్. ఈ రెండు చిత్రాల్లో సరిలేరు సినిమాకు దిల్‌రాజు నిర్మాత అయితే.. బ‌న్నీ సినిమా అల వైకుంఠ‌పుర‌ములో సినిమా నైజాం డిస్ట్రిబ్యూట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు ప్రిఫరబుల్ థియేటర్స్ సెట్ చేయడం దిల్ రాజుకు తలనొప్పిగా మారిందట. ఇప్పటికే రెండు సినిమాల చిత్ర యూనిట్స్ తమకు కావాల్సిన థియేటర్స్ లిస్ట్ ఇవ్వడంతో ఎవరిని ఒప్పించాలో, ఎవరిని నొప్పించాలో తెలియక ఇబ్బంది పడిపోతున్నాడట దిల్ రాజు. మ‌రి ఈ అగ్ర నిర్మాత త‌న స‌మ‌స్య‌ను ఎలా అధిగ‌మిస్తారో వేచి చూడాల్సిందే..

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos