close
Choose your channels

స్క్రీనింగ్‌కు సేనాని గ్రీన్‌సిగ్నల్.. వడపోత కత్తిమీద సామే.!

Wednesday, February 13, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్క్రీనింగ్‌కు సేనాని గ్రీన్‌సిగ్నల్.. వడపోత కత్తిమీద సామే.!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేడో,రేపో ఎన్నికల కోడ్ మొదలవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇవ్వడంతో పాటు, ప్రత్యేక హోదాపై ఢిల్లీలో పోరుబాట పట్టారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా శంఖారావాలతో ఎన్నికల హీట్ పెంచారు. ప్రజల్లో నిత్యం నానుతూనే మరోవైపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సైతం శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో పోటీలో వెనుకబడ్డ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా రంగంలోకి దిగారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తెలంగాణలోని వివిధ లోక్‌సభ స్థానాలకు పార్లమెంటరీ కమీటీలను నియమించారు. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు ముమ్మరం చేశారు.

మంగళవారం జయవాడలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన పిలుపు మేరకు టిక్కెట్లు కోరుతున్న ఆశావహులు బుధవారం వ్యక్తిగతంగానూ, కొరియర్ ద్వారా తమ బయోడేటాలను పంపారు. దీంతో వీటిని స్క్రీనింగ్ చేసి అర్హతలు ఉన్న వారికి టిక్కెట్లు కేటాయించనున్నారు. అభ్యర్థుల స్క్రీనింగ్ కోసం మాదాసు గంగాధరం నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మార్గదర్శకాలకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

ఒక్క రోజుకే ఇంతటి స్పందన రావడం, ఎన్నికలకు మరికొంత సమయం ఉన్నందున రానున్న రోజుల్లో ఆశావహులు మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు వివిధ పార్టీల నుంచి వలసలు సైతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం, వైసీపీలలో ప్లేస్ దక్కని వారికి ప్రత్యామ్నాయంగా జనసేన కనిపిస్తుంది. కొత్త వారితో పాటు సీనియర్ నేతలకు అభ్యర్థులకు టిక్కెట్ల కేటాయింపు జనసేనానికి కత్తిమీద సామే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.