close
Choose your channels

యాంకర్ జయతి ప్రధానపాత్రలో రూపొందుతున్న చిత్రం లచ్చి..

Wednesday, April 6, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
వెన్నెల ప్రొగ్రామ్ ద్వారా పాపుల‌ర్ అయిన యాంక‌ర్ జ‌య‌తి క‌ధానాయిక‌గా న‌టిస్తూ...నిర్మిస్తున్న చిత్రం ల‌చ్చి. ఈ చిత్రాన్ని డైరెక్ట‌ర్ ఈశ్వ‌ర్ తెర‌కెక్కిస్తున్నారు.ఈ చిత్రం త్వ‌ర‌లో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.
ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో యాంక‌ర్ ట‌ర్న‌డ్ హీరోయిన్ జ‌య‌తి మాట్లాడుతూ.. ప్రొడ‌క్ష‌న్ హౌస్ స్టార్ట్ చేసి మంచి చిత్రాలు నిర్మించాల‌నేది నా కోరిక‌. మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన మై బాస్ అనే సినిమా నాకు బాగా న‌చ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాల‌ని రైట్స్ తీసుకున్నాను. ఈ సినిమా చేద్దాం అనుకుంటున్న స‌మ‌యంలో డైరెక్ట‌ర్ ఈశ్వ‌ర్ ఓ క‌థ చెప్పారు. ఈ క‌థ నాకు న‌చ్చ‌డంతో ముందు ఈ సినిమా ప్రారంభించాం.
ఈ సినిమాలో నేను న‌టించాల‌నుకోలేదు. ఇందులో క్యారెక్ట‌ర్ న‌న్ను బాగా ఆక‌ట్టుకుంది. మా డైరెక్ట‌ర్ కూడా మీరు చేస్తే బాగుంటుంది అన్నారు. స‌రే అని న‌టించాను. ప‌ల్లెటూరులో జ‌రిగే విభిన్న క‌థా చిత్ర‌మిది. ఈ సినిమా టైటిల్ ల‌చ్చి. ఇది థ్రిల్లింగ్ కామోడీ హ‌ర్ర‌ర్ మూవీ. య‌ధార్ధ సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. జ‌య 9 ఫోర్ షోస్ అనే బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మించాను. ఈ సినిమా కోసం తిరుప‌తిలో షూటింగ్ చేసాం. ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. వ‌చ్చే వారంలో ల‌చ్చి ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్ష‌కులు న‌న్ను హీరోయిన్ గా ఆద‌రిస్తే న‌టిగా కంటిన్యూ అవుతాను. లేక‌పోతే నిర్మాత‌గా మంచి సినిమాలు నిర్మిస్తాను అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.