close
Choose your channels

బాబును నమ్మించి.. రూ.43 కోట్లతో వైసీపీలోకి కీలకనేత

Saturday, March 16, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అవును మీరు వింటన్నది నిజమే.. ఇటీవల నెల్లూరు రూరల్ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరును టీడీపీ అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పక్కా ప్లాన్‌తో తనకు గత 15 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెండింగ్‌ బిల్లులన్నింటిని.. మొత్తం సుమారు రూ.43 కోట్ల బిల్లులకు సంబంధించి క్లియరెన్స్‌ వచ్చేసింది. దీంతో పని పూర్తవ్వగానే ఆదాల అమరావతి నుంచి నెల్లూరుకు చేరుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 12గంటల ప్రాంతంలో బిల్లులు మొత్తం కంపెనీ ఖాతాలో జమయ్యాయని తెలుసుకున్న ఆదాల అమరావతికి వెళ్లొస్తానంటూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అనంతరం వైసీపీ నేతలకు టచ్‌లోకి వెళ్లి ఫోన్ స్విచాఫ్ చేసేశారు. దీంతో జిల్లా నేతలు, టీడీపీ అధిష్టానం ఒకింత కంగుతిన్నది.

కాగా.. శుక్రవారం మధ్యాహ్నం అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన శనివారం మధ్యాహ్నం లోటస్‌పాండ్‌లో ప్రత్యక్షమయ్యారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో ఆదాల కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇన్ని రోజులు పార్టీలో ఎందుకు చేరలేదా? అని బాధపడుతున్నానని ఆదాల చెప్పుకొచ్చారు. తనను నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి జగన్ పోటీ చేయమన్నారని.. తప్పకుండా గెలిచి తీరుతానని ఆయన తెలిపారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడం, వైఎస్ జగన్‌ను సీఎం చేయడమే ఆంధ్రరాష్ట్ర కోరిక అని, ఇది కచ్చితంగా నెరవేరుతుందన్నారు.

ఇదిలా ఉంటే.. ఆదాలకు నెల్లూరు పార్లమెంట్ టికెట్ ఇస్తే గత ఎన్నికల్లో పోటీచేసిన ఎంపీ మేకపాటి పరిస్థితేంటి..? ఆయనకు ఎక్కడ్నుంచి పోటీ చేస్తారు..? ఆయన పోటీ చేస్తారా..? లేకుంటే ఈ ఎన్నికలకు దూరంగా ఉంటారా..? లేదా వైసీపీకి గుడ్ బై చెబుతారా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఆయన్ను రాజ్యసభకు పంపుతారని తెలుస్తోంది. కాగా ఇందుకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.