close
Choose your channels

'మన్మథుడు 2' సెన్సార్ పూర్తి

Tuesday, August 6, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మన్మథుడు 2 సెన్సార్ పూర్తి

టాలీవుడ్ కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `మన్మథుడు 2`. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో సినిమా రిలీజ్ ఇక లాంఛనమే. ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలతో పోటీపడుతూ హ్యాండ్‌సమ్‌గా కనపడుతున్నారు నాగార్జున. కీర్తిసురేశ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సమంత అక్కినేని అతిథి పాత్రలో కనపడనున్నారు.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని `యు/ఎ` సర్టిఫికేట్2ను పొందింది. మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్స్‌పై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ నిర్మాతలుగా ఈ చిత్రం నిర్మితమైంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.