close
Choose your channels

మూడు రాజధానుల శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్..

Sunday, August 9, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మూడు రాజధానుల శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్..

మూడు రాజధానుల శంకుస్థాపన కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 16 నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని నరేంద్రమోదీని ఈ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు ఏపీ సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. ఈ మేరకు మోదీ అపాయింట్‌మెంట్ కూడా కోరారు. మూడు రాజధానులతో పాటు పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా అదే రోజు నిర్వహించాలని జగన్ భావిస్తున్నారు.

ఈ రెండు కార్యక్రమాల్లో ప్రత్యక్షంగానో లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారానో పాల్గొనాలని మోదీని జగన్ కోరానున్నారు. మరో రెండు నెలల పాటు ముహూర్తాలు లేవని.. కాబట్టి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శంకుస్థాపన కార్యక్రమాన్ని ఈనెల 16న నిర్వహించాలని తలపెట్టామని.. కాబట్టి వీలైనంత త్వరగా ప్రధాని అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కోరుతూ ప్రధాని కార్యాలయం సంయుక్త కార్యదర్శి శేషాద్రికి జగన్ ముఖ్య కార్యదర్రశి ప్రవీణ్ ప్రకాశ్ లేఖ రాసినట్టు తెలుస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.