close
Choose your channels

నయన్ విమర్శలకు 14 ఏళ్ల తర్వాత స్పందించిన మురుగదాస్

Wednesday, January 1, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నయన్ విమర్శలకు 14 ఏళ్ల తర్వాత స్పందించిన మురుగదాస్

ఎక్స్ పిచ్చి.. వై పిచ్చి అంటూ ‘గజిని’ సినిమాలో ఆడిపాడి.. కుర్రకారును హుషారెత్తించిన భామ నయనతార. ఆ సినిమా తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోనవసరం లేకుండా పోయింది. పోరగాళ్ల హృదయాల్లో గూడు కట్టేసుకుందన్న చందాన.. దక్షిణాదిన టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. 2005లో విడుదలైన ఈ సినిమాను ఏఆర్ మురుగదాస్‌ డైరెక్ట్ చేశాడు. సూర్య, అసిన్ జంటగా నటించగా.. నయన్ కీలకపాత్ర పోషించింది. అయితే అప్పట్లో మురుగదాస్‌పై ఆమె తీవ్ర విమర్శలు చేసింది. దర్శకుడు తన పాత్ర నిడివి తగ్గించి చూపాడని.. కథ చెప్పిన దానికి, తర్వాత తీసిన దానికి చాలా తేడా ఉందని విమర్శించింది. అంతేగాక ఫొటోగ్రఫీ కూడా సరిగ్గా లేదని ఆరోపించింది. ఈ సినిమాను ఒప్పుకోవడం చెత్త నిర్ణయంగా అభివర్ణించింది.

దీనిపై మురుగదాస్ తాజాగా స్పందించారు. కథకు తగ్గట్టుగా తాను నటీనటులను ఎంపిక చేసుకుంటానని.. దీనిలో తన ఇష్టాయిష్టాలకు తావుండదని పేర్కొన్నాడు. కథ డిమాండ్ మేరకు మాత్రమే నడుచుకుంటానని స్పష్టం చేశారు. ఓ వ్యక్తి నచ్చాడనో.. లేదా పాత్ర నచ్చిందనో దాని నిడివి పెంచడం.. తగ్గించడం ఉండదన్నారు. ఒక్కోసారి నచ్చనివాళ్లకు ఎక్కువ నిడివి ఇవ్వాల్సి వస్తుందని.. మరోసారి నచ్చినవాళ్లకు చిన్న చిన్న పాత్రలే ఇవ్వాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.

వచ్చే నెల 9న ప్రేక్షకుల ముందుకు రానున్న సూపర్ రజినీ సినిమా దర్బార్‌లో నయన్ నటించింది. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.