close
Choose your channels

సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో న్యూ ట్విస్ట్..

Wednesday, September 9, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో న్యూ ట్విస్ట్..

టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ ఒకటి వెలుగు చూసింది. ఆమె తల్లి .. టిక్‌టాక్ ద్వారా పరిచయమైన దేవరాజురెడ్డి అనే యువకుడి వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే సదరు దేవరాజు రెడ్డి తాను పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు సిద్ధమని వెల్లడించాడు. శ్రావణి కాల్ రికార్డింగ్స్ అన్నీ కూడా పోలీసుల ముందు ఉంచుతానని స్పష్టం చేశాడు. తన ముందే సాయి అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకోవాలని శ్రావణిపై ఒత్తిడి తెచ్చాడని.. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాడనే భయంతోనే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని దేవరాజు చెబుతున్నాడు.

శ్రావణి తన తల్లిదండ్రుల ఒత్తిడితోనే తనపై కేసు పెట్టిందని దేవరాజు తెలిపాడు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో తనను వివాహం చేసుకోవాలని అడిగిందని.. తాను ఒప్పుకోలేదన్న కోపంతోనే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని దేవరాజు చెప్పుకొచ్చాడు. తనపై పెట్టిన కేసులను సైతం వెనక్కి తీసుకుంటానని శ్రావణి తనకు చెప్పిందని దేవరాజు వెల్లడించాడు. అయితే శ్రావణి ఆత్మహత్యపై ఆమె అక్కాబావ స్పందించారు. శ్రావణిని దేవరాజురెడ్డి సీరియల్స్‌లో అవకాశం ఇప్పించాలని కోరితే ఆమె ఇప్పించిందని వెల్లడించారు. ఆ పరిచయంతోనే శ్రావణిని దేవరాజు బ్లాక్ మెయిల్ చేసేవాడని చెప్పుకొచ్చారు.

కాగా.. శ్రావణి మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మధుర నగర్ హెచ్ 56 బ్లాక్ రెండవ ఫ్లోర్‌లో బాత్‌రూమ్‌లో శ్రావణి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాత్‌రూమ్‌లో నుంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు డోర్ పగులగొట్టుకుని లోపలికి వెళ్లేసరికే ఆమె విగతజీవిగా పడి ఉంది. వెంటనే శ్రావణిని కుటుంబ సభ్యులు యశోద హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తేల్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.