close
Choose your channels

నితిన్ లైనప్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్.. ఈసారి డెబ్యూ డైరెక్టర్ తో..

Tuesday, June 15, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నితిన్ లైనప్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్.. ఈసారి డెబ్యూ డైరెక్టర్ తో..

యూత్ స్టార్ నితిన్ వరుస చిత్రాలని చకచకా పూర్తి చేస్తున్నాడు. నితిన్ ఇప్పటికే ఈ ఏడాది రెండు చిత్రాలని రిలీజ్ చేశాడు. చెక్, రంగ్ దే చిత్రాలు ఈ ఏడాది థియేటర్స్ లో విడుదలయ్యాయి. రెండు యావరేజ్ చిత్రాలుగానే నిలిచాయి. ప్రస్తుతం నితిన్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మ్యాస్ట్రో చిత్రంలో నటిస్తున్నాడు.

ఇదీ చదవండి: స్టార్ హీరోకి రూ.100 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్న దిల్ రాజు?

హిందీలో ఘనవిజయం సాధించిన అంధాదున్ కి ఇది రీమేక్. కోవిడ్ తర్వాత సోమవారమే ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది. మాస్ట్రో తర్వాత నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. తాజాగా నితిన్ మరో చిత్రాన్ని కూడా లైన్ లో పెట్టినట్లు సమాచారం.

ప్రముఖ ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్ ని నితిన్ దర్శకుడిగా పరిచయం చేయబోతున్నట్లు టాక్. బిజినెస్ మాన్, టెంపర్, లై చిత్రాలకు శేఖర్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం నితిన్ మ్యాస్ట్రోకి కూడా అతడే ఎడిటర్. నితిన్ కోసం శేఖర్ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశాడట. శేఖర్ స్క్రిప్ట్ కి నితిన్ ఫిదా అయినట్లు తెలుస్తోంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ చిత్రానికి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వక్కంతం వంశీ చిత్రం పూర్తయ్యాక బహుశా ఈ ఏడాది చివర్లో నితిన్, శేఖర్ కాంబోలోని చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది.

గత ఏడాది నితిన్ భీష్మ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం నటిస్తున్న మ్యాస్ట్రోపై భారీ ఆశలే పెట్టుకున్నాడు నితిన్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.