వెబ్ సిరీస్లో నిత్యామీనన్
Send us your feedback to audioarticles@vaarta.com
విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్న నిత్యామీనన్ ఇప్పుడు డిజిటల్ మీడియాలో భాగమైన వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ నిర్మించి బాలీవుడ్లో విజయవంతమైన వెబ్ సిరీస్ల్లో `బ్రీత్` ఒకటి. ఇప్పుడు దీనికి సెకండ్ సీజన్ స్టార్ట్ అయ్యింది. తొలి సీజన్ను డైరెక్ట్ చేసిన మయాంగ్ సీజన్ 2ను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు.
త్వరలోనే ఈ సీజన్ త్వరలోనే విడుదల కానుంది. ఆసక్తికరమైన విషయమేమంటే.. ఈ వెబ్సిరీస్ సీజన్ ద్వారా ఇద్దరు డెబ్యూ చేయబోతున్నారు. ఒకరు బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ కగా.. మరొకరు నిత్యామీనన్. వీరిద్దరితో పాటు అమిత్ షాద్ కూడా నటిస్తున్నారు. సామాన్య వ్యక్తులు అసామాన్య పరిస్థితులను ఫేస్ చేసినప్పుడు వారెలా రియాక్ట్ అయ్యారనేదే బ్రీత్ కాన్సెప్ట్. ఇది సైకలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.