close
Choose your channels

అయోధ్య రామ మందిరం నిర్మాణానికి భారీ విరాళం అందజేసిన పవన్

Friday, January 22, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అయోధ్య రామ మందిరం నిర్మాణానికి భారీ విరాళం అందజేసిన పవన్

అయోధ్య రామ మందిరం నిర్మాణానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భారీ విరాళాన్ని అందజేశారు. శుక్రవారం ఆర్ఎస్ఎస్ రాష్ట్ర చీఫ్ భరత్‌ని కలిసిన పవన్.. అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం రూ. 30 లక్షల విరాళం అందచేశారు. అలాగే తన వ్యక్తిగత సిబ్బంది సమకూర్చిన రూ. 11,000 చెక్కును సైతం భరత్‌కు పవన్ కల్యాణ్ అందచేశారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. "ధర్మానికి ప్రతిరూపం శ్రీరామచంద్రుడు. ఆయన చూపిన సహనం, త్యాగం, శౌర్యం అందరికీ స్ఫూర్తి. భారతదేశం ఇన్ని దాడులకు బలంగా నిలబడింది అంటే అది శ్రీరామచంద్రుడు వేసిన దారే.. అలాంటి ధర్మానికి ప్రతిరూపం అయిన అయోధ్యలో ఆలయం కడుతుంటే మద్దతు తెలపాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉంది. నా వంతుగా 30 లక్షల రూపాయలు రామాలయ నిర్మాణానికి ఇస్తున్నాను. నేను ఇలా విరాళం ఇస్తున్నాను అని తెలియగానే నా వ్యక్తిగత సిబ్బంది కూడా తమ వంతుగా రూ. 11000 సమకూర్చారు. ఈ సిబ్బందిలో హిందువులే కాదు ముస్లింలు, క్రైస్తవులు కూడా ఉన్నారు " అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బీజేపీ నాయకులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.