close
Choose your channels

వైరల్ అవుతున్న పవన్ లేటెస్ట్ పిక్...

Sunday, December 20, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్‌ షూటింగ్ స్పాట్‌కు వెళుతుండటంతో వారిని కాదనలేక పవన్ వారితో కలిసి ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఇటీవల ఫ్యాన్స్‌తో దిగిన కొన్ని పిక్స్ వైరల్ కాగా.. తాజాగా మరో పిక్ వైరల్ అవుతోంది. అభిమాన సమూహంతో కలిసి పవన్ ఫోటో తీసుకున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ పిక్‌లో పవన్ అభిమానులతో పాటు మోకాళ్లపై కూర్చొని ఉండటం అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది. పవన్ ఫోటో తీసుకున్న తీరుకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

కాగా.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ ‘వకీల్‌సాబ్‌’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ సినిమా ‘పింక్’‌కు రీమేక్‌గా ‘వ‌కీల్‌సాబ్’ రూపొందుతోంది. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేదా థామ‌స్‌, అంజ‌లి ఇందులో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత ఆయన పలు చిత్రాలకు సైన్ చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో త్వరితగతిన ‘వకీల్‌సాబ్’ను పూర్తి చేసి నెక్ట్స్ సినిమాను లైన్‌లో పెట్టాలని పవన్ చూస్తున్నారు. కాగా.. గతంలో ఆయన దీక్ష చేపట్టిన కారణంగా గుబురు గడ్డంతో కనిపించేవారు. సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే నాటికి దీక్ష కూడా పూర్తి కావడంతో స్మార్ట్ లుక్‌లోకి పవన్ వచ్చేశారు. దీంతో ప్రస్తుతం పవన్ పిక్స్ అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.