close
Choose your channels

ప్రజావేదిక కూల్చివేత షురూ.. తర్వాత ఇవేనా..!

Tuesday, June 25, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రజావేదిక కూల్చివేత షురూ.. తర్వాత ఇవేనా..!

అవినీతి, అక్రమంగా నిర్మించిన నవ్యాంధ్ర రాజధాని అమరావతి.. ఉండవల్లిలోని ప్రజావేదికను కూల్చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సీఎం ఆదేశాల మేరకు మంగళవారం నాడు రెండో రోజు కలెక్టర్ల సదస్సు ముగిసిన అనంతరం.. ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే సీఆర్డీఏ అధికారులు అక్కడికి చేరుకుని ప్రజావేదికలోని ఫర్నీచర్‌, ఏసీలు, మైకులు, ఎలక్ట్రానిక్‌ సామగ్రిని వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. కూల్చివేతపై సీఆర్డీయే ఉన్నతాధికారులు, ఇంజినీర్లు దగ్గరుండి సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు. ఇవాళ రాత్రి లేదా.. రేపు ఉదయం పది గంటల కల్లా కూల్చివేత పూర్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అయితే.. ఈ ప్రజావేదిక కూల్చివేత అనంతరం కృష్ణా నది ఒడ్డున ఉన్న మరికొన్ని కట్టడాలు కూల్చివేస్తారని పలు భవనాల పేర్లు ప్రచారంలో జరుగుతున్నాయి. మొత్తం 21 అక్రమ కట్టడాలు.. కరకట్టలో ఉన్నాయి.

త్వరలో ఇవో కూల్చబోతున్నారట...

01. చందన కేదారినాథ్, చందన బ్రదర్స్
02. సుంకర శివరామకృష్ణ,
03. అవధూత దత్తపీఠం (వుడా అనుమతి ఉంది)
04. ఇస్కాన్ ఆశ్రమం..
05. ఆక్వా డెవిల్స్ అసోసియేషన్...
06. పాతూరు నాగభూషణం గెస్ట్ హౌస్..
07. తులసీ వనం....గుంటూరు డాక్టర్..
08. LEPL గెస్ట్ హౌస్ (చంద్రబాబు నివాసం)
09. రివర్ వ్యూ గెస్ట్ హౌస్...
10. నెక్కంటి అప్పారావు...
11. రొయ్యల కంపెనీ...
12. పిల్లల డాక్టర్ సుతేంద్ర గెస్ట్ హౌస్...
13. చిగురు బాలల ఆశ్రమం
14. మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం(వుడా అనుమతి ఉంది)

అయితే ఇవన్నీ.. ప్రచారంలో ఉన్నవి మాత్రమే. మరోవైపు టీడీపీ కూడా ఇవే అక్రమంగా కట్టినవే అని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఇవి ఎంత మాత్రం కూల్చివేస్తారో లేకుంటే వదిలేస్తారో అన్నది తెలియాల్సి ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.