close
Choose your channels

'మహర్షి' గ్రేట్ మెసేజ్.. మెచ్చుకున్న రాజశేఖర్

Tuesday, May 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మహర్షి గ్రేట్ మెసేజ్.. మెచ్చుకున్న రాజశేఖర్

సూపర్‌ స్టార్ మహేశ్ బాబు, పూజాహెగ్దే నటీనటులుగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం 'మహర్షి'. మే-09న థియేటర్లలోకి వచ్చి సూపర్ డూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఓ వైపు 'మహర్షి'.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ.. కలెక్షన్ కింగ్‌లా మారి రికార్డులన్నీ బద్దలు కొడుతున్నాడు!  దీంతో.. అసలు సినిమాలు అంతగా సందేశం ఏముందబ్బా..? అంటూ ఎంతో ఆసక్తిగా సినీ,రాజకీయ ప్రముఖులు సైతం థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు నటీనటులు ‘మహర్షి’ సినిమా చూసి సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. 

అద్భుతమైన సందేశం..

అయితే తాజాగా యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ‘మహర్షి’ చిత్రాన్ని తిలకించారు. అనంతరం ట్విట్టర్ వేదికగా 'మహర్షి' తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. "మహర్షి సినిమా ఒక అద్భుతమైన సందేశం. డైలాగ్స్ సూపర్బ్.. అందరూ అద్భుతంగా పెర్ఫామెన్స్ చేశారు.. నాకు మహర్షి సినిమా నచ్చింది. వ్యవసాయ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా చాలా బాగుంది.. నాకు నచ్చింది.. ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి, పూజా హెగ్దే, దిల్ రాజు, పీవీపీ చిత్రబృందానికి ధన్యవాదాలు..  గ్రేట్ జాబ్.." అని దండం పెడుతున్నట్లున్న ఎమోజీని రాజశేఖర్ ట్వీట్ చేశారు.

కాగా.. ఈ యాంగ్రీస్టార్ ట్వీట్‌కు అభిమానులు, నెటిజన్లు, సూపర్‌స్టార్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. మహేశ్, రాజశేఖర్ ఉన్న ఫొటోను కామెంట్ల రూపంలో పెడుతూ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.