close
Choose your channels

కన్నీటి పర్యంతమైన రానా దగ్గుబాటి

Monday, November 23, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మరణానికి 30 శాతం అవకాశముందన్నారు: కన్నీళ్లు పెట్టిన రానా..

అక్కినేని వారి కోడలు సమంత హోస్ట్ చేస్తున్న సామ్‌జామ్ కార్యక్రమానికి అతిథిగా రానా దగ్గుబాటి హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలను రానా పంచుకున్నాడు. దీంతో పాటు ఒక షాకింగ్ విషయాన్ని కూడా చెప్పి రానా కంటతడి పెట్టించాడు. తనకు పుట్టినప్పటి నుంచ కొన్ని అనారోగ్య సమస్యలున్నాయని సామ్‌జామ్‌ కార్యక్రమంలో రానా పంచుకున్నాడు. గుండెకు సమస్య తలెత్తుతుందని.. మరణానికి 30 శాతం అవకాశముందని డాక్టర్లు చెప్పారని రానా వెల్లడించాడు.

జీవితం వేగంగా ముందుకు వెళుతున్న సమయంలో ఒక పాజ్ వచ్చిందని రానా వెల్లడించాడు. పుట్టినప్పటి నుంచి తనకు బీపీ ఉందని తెలిపాడు. గుండెకు సైతం సమస్య తలెత్తుతుందని రానా ఆవేదన వ్యక్తం చేశాడు. తన రఆరోగ్య విషయమై వైద్యులు.. తన కిడ్నీలు పాడవుతాయని చెప్పారన్నారు. అలాగే మెదడులో నరాలు చిట్లిపోవడానికి 70 శాతం అవకాశముందని.. మరణానికి 30 శాతం అవకాశం ఉంటుందని డాక్టర్ చెప్పారని రానా కన్నీటి పర్యంతమయ్యాడు.

కాగా.. రానా అనారోగ్యంతో ఉన్నాడంటూ ఇటీవల సోషల్ మీడియాలో బాగా ప్రచారం నడిచింది. అయితే ఇలాంటి వార్తలను ఆయన ఖండించాడు. అయితే ఇటీవలే రానా ప్రేమ వివాహం చేసుకున్నాడు. రామానాయుడు స్టూడియోలో 2020, ఆగస్టు 8వ తేదీ శనివారం రాత్రి 8.30 గంటల ముహూర్తంలో మిహికా మెడలో మూడు ముళ్లు వేశారు. కుటుంబ సభ్యులు, పరిమిత సంఖ్యలో సన్నిహితుల సమక్షంలో తెలుగు, మార్వాడీ సంప్రదాయాల ప్రకారం రానా వివాహం చేసుకున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.