close
Choose your channels

చంద్రబాబు- బ్రహ్మానందం ఇద్దరూ ఒక్కటే..: ఆర్జీవీ

Thursday, July 11, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చంద్రబాబు- బ్రహ్మానందం ఇద్దరూ ఒక్కటే..: ఆర్జీవీ

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుపై.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డోస్ పెంచి మరీ విమర్శలు గుప్పించడం మొదలెట్టేశారు. మరీ ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి చంద్రబాబు అదోలా ఉండటం.. సీటు మారేసరికి బాబు ముఖంలో కల తప్పడం ఇలాంటివన్నీ హావభావాలన్నీ కనిపిస్తున్నాయి. అయితే గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు, జగన్‌ల మధ్య మాటల యుద్దం నెలకొన్న విషయం విదితమే. దీంతో ఈ విషయాలను ప్రస్తావిస్తూ.. ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.

చంద్రబాబుపై రివెంజ్!
అయితే చంద్రబాబును కమెడియన్ చంద్రబాబుతో పోల్చడం గమనార్హం. "ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా సీఎం జగన్ నవ్వుతున్నారు. బ్రహ్మనందం తెరపై కనిపించినప్పుడు ప్రేక్షకులు కూడా ఇదే రకంగా నవ్వేవారు. టీడీపీ అనేది అసెంబ్లీలో కామెడీ ట్రాక్‌లా మారిపోయింది.. జస్ట్ ఆస్కింగ్" అని చంద్రబాబును ఉద్దేశించి పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా రామ్‌గోపాల్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి గతంలో చంద్రబాబు ప్రభుత్వం, టీడీపీ నేతలు అడగడుగునా అడ్డుపడ్డారు. అంతేకాదు.. ఆఖరికి సినిమాకు సంబంధించి చిన్నపాటి మీడియా సమావేశం పెట్టుకోవడానికి కూడా ఆర్జీవీ అవకాశం ఇవ్వలేదు. దీంతో అప్పట్లో ఆర్జీవీకి షాక్‌ల మీద షాక్‌లను టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఆ షాక్‌ల నుంచి ఇంకా తేరుకోని ఆర్జీవీ.. ఇలా ట్విట్టర్ వేదికగా చంద్రబాబు రివెంజ్ తీర్చుకుంటున్నారన్న మాట.

కాగా.. టీడీపీని.. ముఖ్యంగా టీడీపీ అధినేతపై అధికార, బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ఆరోపణలు చేసినా.. విమర్శలు గుప్పించినా ట్విట్టర్ లేదా మీడియా వేదికగా రియాక్ట్ అయ్యే మాజీ మంత్రి లోకేష్, బుద్దా వెంకన్న, ఎంపీ కేశినేని.. ఆర్జీవీ వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.