నేనొక ముళ్ల పందిని.. సీక్రెట్స్ అన్నీ చెప్పను: ఆర్జీవీ

  • IndiaGlitz, [Tuesday,February 19 2019]

సంచలన దర్శకుడు రామ్‌‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వివాదాస్పద చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించిన నాటి నుంచి మూడు గొడవలు.. ఆరు వివాదాలుగా షూటింగ్ సాగింది. అయితే వీటన్నింటినీ కూడా ఆయన తన మాస్టర్ మైండ్‌తో ఒక ప్రమోషన్‌‌లాగానే వాడేసుకున్నారు. ఇటీవల విడుదలైన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్‌‌ను సినీ, రాజకీయ ప్రముఖులు చూస్తున్నట్లు మార్పింగ్ చేసిన ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా పెద్ద పంచాయితీ పెట్టారు. ఈ విషయమై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు కథేంటో చెప్పేశారు.

రాంగోపాల్ వర్మ మాటల్లోనే..

నా శ్రేయోభిలాషి ఒకరు ఉన్నారు. వారి ఫ్రెండ్ ఆయనతో మాట్లాడుతూ రామ్‌‌గోపాల్ వర్మ ఏంటి మరీ ఇంత చీప్‌‌గా పబ్లిసిటీ చేస్తారు..?. పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తారా..?. ముఖ్యంగా ట్రైలర్ చాలా బాగుంది. కానీ సోనియాగాంధీ, రాహుల్ గాంధీచ, మోదీ చూస్తున్నట్లు ఉన్నాయని ఇంత చీప్‌‌ పబ్లిసిటీ ఎందుకు?. అసలు అలాంటివి అవసరం లేదు అని నా సలహా అని మీ ఫ్రెండ్‌‌కు చెప్పండి అని నా శ్రేయోభిలాషికి వివరించారు. ఇందుకు నేను చాలా సమాధానం ఇచ్చాను అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. అయితే శ్రేయోభిలాషి మిత్రుడికి ఆర్జీవీ కింది విధంగా ఇంటర్వ్యూ వేదికగా చురకలింటించారు.

ఆర్జీవీ ఆన్సర్..:- ఆయన సలహా ఆయనకే ఉపయోగించుకోమను. ఆయన్నే బుద్ధి చేసుకోమనండి. ఇక్కడ పాయింట్ ఏమంటే.. ‘నేను ఒక ముళ్లపందిని’.. ముళ్ల పందిని ముళ్లు వద్దంటే పందిగా వస్తాను(నవ్వుతూ). పందులే ముళ్లపందుల గురించి ఆలోచిస్తాయి. ముళ్ల పంది పందుల గురించి ఆలోచించదు. నేను చీప్ పబ్లిసిటీ చేస్తానా..? కాంట్రవర్సీ చేస్తానా..? కాకపోతే ఏదో పిచ్చిపిచ్చిగా మాట్లాడతానా..? అనేది పాయింట్ కాదు. అవును నేను ముళ్లపందిని.. నన్ను నేనే తిట్టుకుంటున్నాను. అందుకే పందులు.. ముళ్ల పందులకు సలహా ఇవ్వకూడదు. ఆ శ్రేయోభిలాషి ఎవరో మీకు చెప్పను.. అది చాలా సీక్రెట్ అని నవ్వుతూ తన మాటను ముగించారు. అయితే అటు వైపు లైవ్‌‌లో ఉన్న లక్ష్మీపార్వతి, యాంకర్ ఇద్దరూ రెండు నిమిషాలపాటు ఆర్జీవీ మాటలకు నవ్వు ఆపుకోలేదు. ఎదుటి వారు నవ్వుతున్నా ఎవరేమనుకుంటే నాకేంటి అన్నట్లుగా ఆర్జవీ తాను చెప్పాలనుకున్నది చెప్పేసి మిన్నకుండిపోయారు.

కాగా.. ఆర్జీవీ తనను తాను తిట్టుకోవడం.. తనకు తాను ఏదేదో ఊహించుకోవడం ఇవాళేం కొత్తకాదు. సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారం పోస్ట్‌‌లు పెట్టడం, ‘ఎవడేమనుకున్నా నాకేంటి’.. ఎవడైనా అడ్డొస్తే ఖబడ్డార్ అంటూ పెద్ద దుమారం రేపే పోస్ట్‌‌లు చేసిన సందర్భాలు కోకొల్లలు. 

More News

రిహార్సల్స్ చేస్తూ కుప్పకూలిన విమానాలు

ఏరో ఇండియా ఎక్స్‌‌పో-2019 కోసం బెంగళూరులోని ఎలహంక ఎయిర్‌‌బేస్ వద్ద రిహార్సల్స్ చేస్తుండగా రెండు విమానాలు పరస్పరం ఢీ కొన్ని కుప్పకూలాయి.

ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేసిన హరీశ్ రావు

టీఆర్ఎస్ ఉద్దండుడు, గులాబీ బాస్‌‌‌ కేసీఆర్‌కు కట్టప్పలా ఉండే మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌ రావుకు మంత్రి పదవి ఇవ్వట్లేదని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

'రాక్ష‌స‌న్'లో రాశీఖ‌న్నా

ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ 'సీత‌' త‌ర్వాత ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ సూప‌ర్‌హిట్ చిత్రం 'రాక్ష‌స‌న్‌' లో రీమేక్‌లో న‌టించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

తండ్రి పాత్ర‌లో క్రేజీ హీరో...

రీసెంట్ టైంలో వ‌రుస విజ‌యాల‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుకున్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ హీరో త‌దుప‌రి కె.ఎస్‌.రామారావు

నాగ్ చిత్రంలో యంగ్ మ్యూజిషియ‌న్‌

అక్కినేని నాగార్జున ఇప్పుడు రెండు సీక్వెల్స్‌ను సెట్స్‌కు తీసుకెళ్ల‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. వాటిలో ముందుగా 'మ‌న్మ‌థుడు' సీక్వెల్ 'మ‌న్మ‌థుడు 2', 'సొగ్గాడే చిన్నినాయ‌నా' సీక్వెల్ 'బంగార్రాజు'.