close
Choose your channels

ఆ వార్తల్లో నిజం లేదంటున్న సమంత..!

Wednesday, October 26, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొంద‌నుంది. ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్ 5న ఈ చిత్రం ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు అని సమాచారం. అయితే...త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తెర‌కెక్కించిన స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, అత్తారింటికి దారేది..! అ ఆ చిత్రాల్లో స‌మంత న‌టించింది. ప‌వ‌ర్ స్టార్ తో త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించే తాజా చిత్రంలో కూడా స‌మంత న‌టిస్తుంది. త్రివిక్ర‌మ్ - స‌మంత కాంబినేష‌న్లో ఇది నాలుగ‌వ సినిమా అవుతుంది అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌ల పై స‌మంత ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ....ఈ వార్త‌ల్లో నిజం లేదు అని తెలియ‌చేసింది. మ‌రి...ఈ చిత్రంలో ప‌వ‌ర్ స్టార్ స‌ర‌స‌న హీరోయిన్ గా త్రివిక్ర‌మ్ ఎవ‌ర్ని సెలెక్ట్ చేస్తారో చూడాలి..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.