close
Choose your channels

మోస్ట్ రీట్వీట్ రికార్డు - సర్కారు వారి పాట టైటిల్ లోగో

Tuesday, June 2, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌హేశ్ 27..రికార్డుల వేట‌

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న 27వ సినిమాగా `స‌ర్కారు వారి పాట` అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ లోగోతోనే మ‌హేశ్ త‌న రికార్డుల వేట‌ను ప్రారంభించారు. స‌ర్కారు వారి పేట టైటిల్ లోగో.. 24 గంట‌ల్లో మోస్ట్ రీ ట్వీట్ టైటిల్ లోగోగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాత‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు.

మోస్ట్ రీట్వీట్ రికార్డు - సర్కారు వారి పాట టైటిల్ లోగో

ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు ప‌వ‌ర్‌ఫుల్ మెసేజ్ కూడా ఉంటుంద‌ని మ‌హేశ్ తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. బ్యాంకుల‌ను మోసం చేసిన విల‌న్ నుండి తిరిగి డ‌బ్బులు రాబ‌ట్టే క‌థే ఈ సినిమా అని వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ సినిమా హీరోయిన్ ఎవ‌ర‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. త్వ‌ర‌లోనే సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్ ప్ల‌స్ బ్యాన‌ర్స్‌పై సినిమా నిర్మిత‌మ‌వుతోంది. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. పి.ఎస్‌.వినోద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో హిట్ కొట్టిన మ‌హేశ్.. త‌దుప‌రి సినిమాకు సిద్ధ‌మ‌య్యాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.