close
Choose your channels

షాకింగ్.. ఏపీలో ఇవాళ ఒక్కరోజే 7998 కేసులు

Thursday, July 23, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీలో షాకింగ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఏపీకి సంబంధించిన కరోనా బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 58,052 పరీక్షలు నిర్వహించగా.. 7998 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 72,711కు చేరుకుంది. 61 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా కారణంగా ఏపీలో 884 మంది మృతి చెందారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 34272 యాక్టివ్ కేసులుండగా.. 37555 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా నేడు కరోనా కారణంగా తూర్పు గోదావరిలో 14 మంది, గుంటూరులో ఏడుగురు, కర్నూలులో ఏడుగురు, కృష్ణాలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, చిత్తూరులో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, కడపలో ఒక్కరు, అనంతపూర్‌లో ఒకరు మరణించారు. నేటి వరకూ ఏపీలో 14,93,879 శాంపిల్స్‌ని పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.