close
Choose your channels

పవన్‌తో సోము వీర్రాజు భేటీ.. కీలక విషయాలపై చర్చ

Friday, August 7, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన తొలిసారిగా పవన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఇద్దరూ మాట్లాడుకున్నారు. జ‌న‌సేన‌తో క‌లిసి బీజేపీ ప్ర‌ణాళిక‌ల‌కు సంబంధించిన కీల‌క అంశాల్ని ఈ భేటీలో చర్చించారు. ముఖ్యంగా ఆ ఇద్ద‌రి భేటీలో మూడు రాజధానుల అంశంతో పాటు.. ఆంధ్రప్ర‌దేశ్ అభివృద్ధి అంశంపైనే చ‌‌ర్చ సాగినట్టు తెలుస్తోంది.

ఆర్థికంగా, సామాజికంగా, నిర్మాణాత్మ‌కంగా ఇరు పార్టీలూ కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్ర‌ణాళికా బ‌ద్ధ‌మైన ప్లాన్ చేసేందుకు ఈ క‌ల‌యిక అని తెలుస్తోంది. త్వ‌ర‌లో వీరిద్దరి భేటీ మరోసారి జరగనుందని.. అప్పుడు ముఖ్యంగా 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఓ ప్రణాళికను రూపొందించనున్నట్టు సమాచారం. కాగా.. నిన్న సోము వీర్రాజు.. మెగాస్టార్ చిరంజీవిని కలిసిన విషయం తెలిసిందే. నేడు పవన్‌ని కలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.