close
Choose your channels

మేడ్చల్‌లో దారుణం.. ఆటో డోర్‌ తీయడంతో ఇద్దరు దుర్మరణం

Friday, April 26, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మేడ్చల్‌లో దారుణం.. ఆటో డోర్‌ తీయడంతో ఇద్దరు దుర్మరణం

మేడ్చల్‌‌లోని ఐడీఏ బొల్లారంలో దారుణం చోటుచేసుకుంది. మున్సిపాలిటీ గాంధీ చౌరస్తాలో ఆటో డ్రైవర్ పొరపాటు‌తో రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి. వివరాల్లోకి వెళితే.. ఆటోడ్రైవర్ రోడ్డుపై ఒక్కసారిగా వాహనం నిలిపి డోర్ తీయగా వెనుక నుంచి వస్తున్న బైక్‌కు ఆ డోర్ తగిలి కింద పడిపోయారు. అయితే వెనక నుంచి వస్తున్న టిప్పర్ వారిపై నుంచి వెళ్లడంతో ఒకరు అక్కడికక్కడే మరణించగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడ్ని స్థానికంగా గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మరణించారు.

మృతులను సైదిరెడ్డి(32), లక్ష్మీ(35)లుగా గుర్తించారు. వీరి స్వగ్రామం సిద్దిపేట జిల్లా చేర్యాల గ్రామం అని తెలిసింది. గత పదేళ్ల క్రితం ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. వీరు పరిశ్రమలో సెకండ్ షిఫ్ట్ విధులకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని సమాచారం. స్థానిక సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటన జరిగిన అనంతరం ఆటో డ్రైవర్‌ పరారయ్యాడు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. సీసీకెమెరాల్లో స్పష్టంగా దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియో చూసిన జనాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.