జయరామ్ హత్యకేసు: శిఖాకు ఊహించని వ్యక్తి మద్దతు!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అమెరికాలో ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికి నిందితులను అరెస్ట్ చేయగా చిగురుపాటి మేన కోడలు శిఖా చౌదరి విచారించాలని పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ హత్య జరిగిన నాటి నుంచి శిఖా పేరు మార్మోగింది. అయితే తనకు ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని ఆమె గగ్గోలు పెడుతుండగా.. చిగురుపాటి సతీమణి పద్మశ్రీ మాత్రం మొత్తం శిఖా చౌదరే చేసిందని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈమెకు సంబంధించిన రోజుకో కొత్త విషయాలు బయటికి రావడంతో ఒక్కరంటే ఒక్కరు కూడా శిఖాకు మద్దతు తెలపలేదు. కనీసం మహిళా సంఘాలు సైతం ఆమెకు అండగా నిలబడలేదు. ఫస్ట్ టైమ్ శిఖాకు ఊహించని వ్యక్తి నుంచి మద్దతు లభించింది.
టాలీవుడ్ వివాదస్పద నటి శ్రీరెడ్డి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో టాలీవుడ్లో ‘క్యాస్టింగ్ కౌచ్’పై పోరాటం చేసిన శ్రీ ప్రస్తుతం చెన్నైలో ఒకట్రెండు సినిమాలు చేతిలో పట్టుకుని బిజీబిజీగా గడుపుతోంది. పూర్తిగా హైదరాబాద్కు దూరమైపోయిన ఆమె.. నిత్యం అభిమానులు, సినీ ప్రియులకు టచ్లో ఉంటోంది. ఇటీవల హైదరాబాద్కు వచ్చిన ఆమె.. ఎన్నారై జయరామ్ హత్య కేసులో నిందితురాలిగా అనుమానిస్తున్న శిఖా చౌదరి గురించి షాకింగ్ పోస్ట్ చేసింది.
శ్రీరెడ్డి పోస్ట్ సారాంశం ఇదీ..
‘ఎన్నారై జయరాం హత్య కేసులో నిజా నిజాలు తెలుసుకోకుండా శిఖా చౌదరిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు.. శిఖా ఈ మర్డర్ చేసిందని నేను నమ్మడం లేదు. ఈ కేసులో ఆమె అనుమానితురాలు కూడా కాదు’ అంటూ దుమారం రేపే పోస్ట్ చేసింది.
కాగా శిఖా వ్యక్తిత్వం మొదలుకుని ఆమెకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ బోలెడన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో శిఖాకు శ్రీ మద్దతివ్వడంతో పలువురు నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు వాళ్ల గురించి మనకెందుకు అక్కా.. టైమ్ వేస్ట్.. మీ పని మీరు చేస్కోండి అంటూ పలువురు అభిమానులు శ్రీశక్తికి సూచిస్తున్నారు. మరికొందరు ‘రెడ్డి డైరీ’ సినిమా గురించి కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో శ్రీ శక్తి మున్ముంథు ఏం చేయబోతోందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.