close
Choose your channels

ఆర్జీవీని ఏమీ చేయలేక నన్ను అంటారేంటి..!?: వంశీ

Saturday, November 16, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆర్జీవీని ఏమీ చేయలేక నన్ను అంటారేంటి..!?: వంశీ

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఈయన ఎప్పుడైతే రాజీనామా చేస్తానని ప్రకటించి.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిశారో నాటి నుంచి పేపర్లలో చూసినా.. వెబ్‌సైట్లలో చూసినా.. టీవీల్లో చూసినా ఈయన పేరు వినపడుతోంది.. కనపడుతోంది. అయితే తాజాగా మరింత డోస్ పెంచిన వంశీ.. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు మొదలుకుని నారా లోకేశ్.. ఇలా తనపై విమర్శలు గుప్పించి ప్రతీ టీడీపీ నేతపై వంశీ రియాక్ట్ అవుతూ స్ట్రాంగ్ కౌంటర్ల వర్షం కురిపించారు. అయితే శనివారం మీడియా ముందుకొచ్చిన వంశీ.. టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మనూ వదల్లేదు. అసలు ఆయన గురించి వంశీ ఎందుకు మాట్లాడారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఇదీ ‘వర్మ’ పప్పు కథ!?
ఆర్జీవీ తెరకెక్కిస్తున్న వివాదాస్పద చిత్రం ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’.. ఇందులో ఇప్పటికే ఎవరెవరి పాత్రలు ఉంటాయ్..? ఎవరెవరు నటిస్తున్నారు..? అనే విషయాలు క్లారిటీగా చెప్పారు. అయితే ‘పప్పు’ అనే వ్యవహారం మాత్రం ఇటు ఇండస్ట్రీలో.. అటు రాజకీయాల్లో చర్చకు దారితీసింది. అయితే ఈ పప్పుకు సంబంధించి ఇప్పటికే పాటను కూడా ఆర్జీవీ రిలీజ్ చేశారు. వర్మ మాత్రం ఈ పప్పు అనే పదాన్ని గట్టిగా వాడిపారేశారు. అదేంటి మీరు అలాంటున్నారని మీడియా ప్రతినిధులు, డిబెట్లలో ప్రశ్నించగా అబ్బే లోకేశ్‌ను పప్పు అంటారా..? నాకు తెలియదే అని మరీ వర్మ చెబుతున్నాడు. అయితే ఇదే విషయంపై వల్లభనేని వంశీ రియాక్ట్ అయ్యారు.

ఏం తీస్తాడో అని భయం..!
లోకేష్‌ను వంశీ తిట్టాడని.. ముఖ్యంగా ‘పప్పు’ అని వ్యాఖ్యానించారని వార్తలు వచ్చాయి. ఇందుకు ఆయన స్పందిస్తూ.. ‘లోకేష్‌ను పప్పు అని నేను అనలేదు. గున్న, గున్న ఏనుగు అని నేను అనలేదు. ఎవడో రామ్ గోపాల్ వర్మ అన్నాడు.. ఆయనంటే నన్ను అంటారేంటి..?. ఇంటర్నెట్‌లో ఏపీ పప్పు అని టైప్ చేస్తే లోకేష్ ఫొటో వస్తుంది. అలా రాకపోతే ఇప్పుటికిప్పుడు రాజీనామా చేస్తా.. ఎవరో రామ్ గోపాల్ వర్మ లోకేష్‌ను పప్పు అంటే.. అతను బొంబాయిలో ఉంటాడు కాబట్టి, అతడ్ని ఏమీ చేయలేక నన్నంటే ఎలా?. రామ్ గోపాల్ వర్మను ఏమైనా అంటే... మళ్లీ ఏం తీస్తాడో, ఏం రిలీజ్ చేస్తాడో అని భయపడుతున్నారు. చెరుకు రసం తియ్యగా ఉందని.. పాలు తియ్యగా ఉందని తీస్తాడోనని భయం’ అని వంశీ ఎద్దేవా చేశారు. మరి వంశీ తాజా వ్యాఖ్యలకు టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో..? మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే.. విమర్శలను తిప్పికొట్టడంలో ముందుండే ఆర్జీవీ ఎలాంటి కౌంటరిస్తారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.