మ‌రో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన వ‌రుణ్‌?

  • IndiaGlitz, [Tuesday,March 06 2018]

'ఫిదా', 'తొలిప్రేమ' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రస్తుతం ఈ యువ క‌థానాయ‌కుడు 'ఘాజీ' ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అంతరిక్ష నేపథ్యంతో సాగే ఈ సినిమాలో వరుణ్ వ్యోమగామిగా కనిపించనున్నారు. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ సినిమా ఈ ఏడాది చివ‌ర‌లో విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. 'అయ్యారే', 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రాల ద‌ర్శ‌కుడు సాగర్ చంద్ర ఇటీవ‌ల వరుణ్‌కు ఓ కథను చెప్పార‌ని.. ఆ కథ నచ్చడంతో ఆ ప్రాజెక్ట్‌కు కూడా వ‌రుణ్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన‌ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.

తుది మెరుగులు దిద్దుకున్న తర్వాత మరోసారి ఫైనల్ సిట్టింగ్‌లో స్క్రిప్ట్‌ను ఓకే చేసుకుని.. ఆ త‌రువాత‌ అధికారికంగా వివ‌రాల‌ను వెల్లడించనున్నారని సమాచారం. 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంద‌ని తెలిసింది.

More News

శర్వానంద్ 'పడి పడి లేచే మనసు' ఫస్ట్ లుక్

మోస్ట్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా సెన్సిబుల్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం "పడి పడి లేచే మనసు".

మ‌రో కొత్త ద‌ర్శ‌కుడితో క‌ళ్యాణ్ రామ్‌

గత రెండు సంవత్సరాల నుంచి నెమ్మదిగా సాగిన కెరీర్‌ను ప్రస్తుతం పరుగులు పెట్టిస్తున్నారు నందమూరి వారి కథానాయకుడు కళ్యాణ్ రామ్.

రానా కొత్త చిత్రం అప్‌డేట్‌

భూస్వాముల ధ‌నాన్ని కొల్లగొట్టి.. పేదలకు పంచిపెట్టే కథే రాబిన్ హుడ్ స్టోరీ. ఇటువంటి రాబిన్ హుడ్ కథతో యువ క‌థానాయ‌కుడు రానా ఓ సినిమా చేయ‌నున్నారు.

ఆది కొత్త చిత్రానికి ముహుర్తం కుదిరింది

'ప్రేమ కావాలి', 'లవ్లీ' సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న యువ క‌థానాయ‌కుడు ఆది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. 'వినాయకుడు', 'విలేజీలో వినాయకుడు', 'కేరింత' సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు అడివి సాయికిరణ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయ‌నున్నారు.

రామ్ కు సెకండ్ హీరోయిన్ దొరికిందా?

యువ కథానాయకుడు రామ్,దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో