close
Choose your channels

మ‌రో కొత్త ద‌ర్శ‌కుడితో క‌ళ్యాణ్ రామ్‌

Tuesday, March 6, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గత రెండు సంవత్సరాల నుంచి నెమ్మదిగా సాగిన కెరీర్‌ను ప్రస్తుతం పరుగులు పెట్టిస్తున్నారు నందమూరి వారి కథానాయకుడు కళ్యాణ్ రామ్. నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ డైరెక్షన్‌లో ఆయ‌న‌ నటించిన 'ఎం.ఎల్.ఎ' చిత్రం ఈ నెలలోనే విడుదల కానుండగా.. జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన 'నా నువ్వే' సినిమా వేసవి కానుకగా మే 25న‌ రిలీజ్ కానుంది.

ఇక ఇప్పటికే పవన్ సాదినేని చెప్పిన వైవిధ్యమైన కథకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు ఈ యంగ్ హీరో. ఇదిలా వుంటే.. ప్రస్తుతం మరో కొత్త దర్శకుడికి కూడా క‌ళ్యాణ్ రామ్ ఛాన్స్ ఇచ్చారని టాక్.

కాస్త‌ వివరాల్లోకి వెళితే.. గత ఏడాది క‌ళ్యాణ్‌ రామ్ నిర్మాణంలో తెరకెక్కిన 'జై లవకుశ' సినిమాకి కథని అందించిన కోన వెంకట్.. మరో విభిన్నమైన కథతో ఓ కొత్త దర్శకుణ్ణి అత‌ని దగ్గరకు పంపించారట.

కథ నచ్చి క‌ళ్యాణ్‌ రామ్ వెంటనే పచ్చ జెండా ఊపారని టాక్. ఈ చిత్రానికి 'మిలియ‌నీర్' అనే పేరును కూడా ఖరారు చేశారని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.