close
Choose your channels

ఆది కొత్త చిత్రానికి ముహుర్తం కుదిరింది

Tuesday, March 6, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

'ప్రేమ కావాలి', 'లవ్లీ' సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న యువ క‌థానాయ‌కుడు ఆది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. 'వినాయకుడు', 'విలేజీలో వినాయకుడు', 'కేరింత' సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు అడివి సాయికిరణ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయ‌నున్నారు. ఈ చిత్రంలో ఆదికి జంటగా సాషా చెట్రి న‌టిస్తోంది. ఎయిర్ టెల్ 4జి ప్రకటనలతో ఈ భామ అందరికి సుపరిచితురాలే. యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రానికి.. ఈ నెల 7వ తేదీన ముహూర్తం ఫిక్స్ చేశారు.

ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలోనే ప్రకటించనుంది చిత్ర బృందం. ఇదిలా వుంటే.. ప్రస్తుతం నూత‌న ద‌ర్శ‌కుడు విశ్వనాథ్ ఆరిగేల రూపొందిస్తున్న‌ ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌లో ఆది నటిస్తున్నారు.

దాదాపు చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా.. ప్ర‌స్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించనుంది చిత్ర బృందం.అలాగే వేసవి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. గత కొంత కాలంగా విజయానికి దూరమైన ఆది.. ఈ చిత్రాలతోనైనా మ‌ళ్ళీ ట్రాక్‌లోకి వ‌స్తారేమో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.